ETV Bharat / state

SURABHI: సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల చేయూత..!

author img

By

Published : Jun 25, 2021, 5:42 PM IST

Updated : Jun 25, 2021, 6:36 PM IST

సురభి కళాకారుల కష్టాలపై 'ఈటీవీ-ఈటీవీ భారత్'లో ప్రసారమైన 'కరోనా నాటకంలో కన్నీటి పాత్రలు' కథనానికి దాతలు స్పందించారు. కళాకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి సాయం చేశారు. సురభి కళను మరింత ప్రోత్సహించేలా వారికి నాటక సామగ్రిని అందజేశారు.

సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల చేయూత..!
సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల చేయూత..!

కరోనా కష్టకాలంలో సురభి కళాకారులు పడుతోన్న కష్టాలపై 'ఈటీవీ-ఈటీవీ భారత్‌'లో ప్రసారమైన 'కరోనా నాటకంలో కన్నీటి పాత్రలు' కథనానికి స్పందన లభించింది. హైదరాబాద్ నాగోల్‌లోని రైస్ ఏటీఎం నిర్వాహకులు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డలు స్పందించి కళాకారులకు అండగా నిలిచారు. ప్రాజెక్ట్‌ ప్రిషా ద్వారా లింగంపల్లిలో నివసిస్తోన్న పలు సురభి కుటుంబాలకు చేయూతనిచ్చారు. సురభి కళను మరిన్ని తరాలు కొనసాగించేలా వారికి నాటక సామగ్రిని అందజేశారు.

సురభి కుటుంబాల్లో నాటకాలు లేక ఒంటరిగా ఉంటున్న మహిళలకు కుట్టు మిషన్లు, టిఫిన్ సెంటర్ల సామగ్రి, తోపుడు బండ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ సహాయం సురభి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తుందని పేర్కొన్న దాతలు.. సురభి కళాకారులకు నిత్యం అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన రైస్ ఏటీఎం నిర్వాహకులు, ఈటీవీ-ఈటీవీ భారత్‌కు కళాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈటీవీలో ప్రసారమైన మా సురభి కళాకారుల కష్టాలను చూసి రైస్‌ ఏటీఎం నిర్వాహకులు స్పందించినందుకు సంతోషంగా ఉంది. కళాకారులకు నిత్యావసరాలు అందించడమే కాదు.. వారే స్వయంగా నిలదొక్కుకోవాలని కొందరు మహిళలకు కుట్టుమిషన్‌లు ఇచ్చారు. కరోనా కారణంగా భర్త చనిపోయిన ఓ కుటుంబానికి హోటల్‌ పెట్టుకునేందుకు సామగ్రి అందించారు. మా కష్టాలను గుర్తించిన ఈటీవీ-ఈటీవీ భారత్‌కు, రైస్‌ ఏటీఎం నిర్వాహకులకు మా కృతజ్ఞతలు.-జయానంద్, సురభి డ్రామా థియేటర్ నిర్వాహకులు

ఇదీ చూడండి: Surabhi: కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర

కరోనా కష్టకాలంలో సురభి కళాకారులు పడుతోన్న కష్టాలపై 'ఈటీవీ-ఈటీవీ భారత్‌'లో ప్రసారమైన 'కరోనా నాటకంలో కన్నీటి పాత్రలు' కథనానికి స్పందన లభించింది. హైదరాబాద్ నాగోల్‌లోని రైస్ ఏటీఎం నిర్వాహకులు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డలు స్పందించి కళాకారులకు అండగా నిలిచారు. ప్రాజెక్ట్‌ ప్రిషా ద్వారా లింగంపల్లిలో నివసిస్తోన్న పలు సురభి కుటుంబాలకు చేయూతనిచ్చారు. సురభి కళను మరిన్ని తరాలు కొనసాగించేలా వారికి నాటక సామగ్రిని అందజేశారు.

సురభి కుటుంబాల్లో నాటకాలు లేక ఒంటరిగా ఉంటున్న మహిళలకు కుట్టు మిషన్లు, టిఫిన్ సెంటర్ల సామగ్రి, తోపుడు బండ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ సహాయం సురభి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తుందని పేర్కొన్న దాతలు.. సురభి కళాకారులకు నిత్యం అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన రైస్ ఏటీఎం నిర్వాహకులు, ఈటీవీ-ఈటీవీ భారత్‌కు కళాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈటీవీలో ప్రసారమైన మా సురభి కళాకారుల కష్టాలను చూసి రైస్‌ ఏటీఎం నిర్వాహకులు స్పందించినందుకు సంతోషంగా ఉంది. కళాకారులకు నిత్యావసరాలు అందించడమే కాదు.. వారే స్వయంగా నిలదొక్కుకోవాలని కొందరు మహిళలకు కుట్టుమిషన్‌లు ఇచ్చారు. కరోనా కారణంగా భర్త చనిపోయిన ఓ కుటుంబానికి హోటల్‌ పెట్టుకునేందుకు సామగ్రి అందించారు. మా కష్టాలను గుర్తించిన ఈటీవీ-ఈటీవీ భారత్‌కు, రైస్‌ ఏటీఎం నిర్వాహకులకు మా కృతజ్ఞతలు.-జయానంద్, సురభి డ్రామా థియేటర్ నిర్వాహకులు

ఇదీ చూడండి: Surabhi: కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర

Last Updated : Jun 25, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.