ETV Bharat / state

ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక!

author img

By

Published : Apr 25, 2020, 10:12 AM IST

ఒక చోట నుంచి మరొక చోటుకి వివిధ కారణాలతో ప్రయాణమై వెళ్లిన వారు కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడే ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక, తినడానికి తిండిలేక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి సహాయార్థం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కాల్‌ సెంటర్లకు తమను ఆదుకోండంటూ నిత్యం పదుల సంఖ్యలో ఇతర ప్రాంతవాసులు ఫోన్లు చేసి వారి గోడు వెల్లబుచ్చుకుంటున్నారు. కరోనా కరుణిస్తే తాము సొంతూర్లకు వెళ్లాలని ఎదురుచూస్తున్నారు.

difficulties of migrants due to corona lock down
ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక!

* ఎస్‌ఆర్‌నగర్‌ బంధువుల ఇంటికి చెన్నై నుంచి వచ్చిన ఓ మహిళ నెల రోజులుగా ఇక్కడే ఇరుక్కుపోయారు. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల అప్పటి నుంచి ఇక్కడే కాలం గడుపుతున్నారు. తన కుమారుడు కువైట్‌లో ఉండటం వల్ల.. కోడలు, మనుమలు చెన్నైలో ఉంటున్నారు. వారు అక్కడ... ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటూ తీవ్రంగా మదన పడుతున్నారు. ఎప్పటిలోగా లాక్‌డౌన్‌ పూర్తి అవుతుందోనని ఎదురు చూస్తున్నారు.

* ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనాథ్‌రెడ్డి విద్యానగర్‌లోని తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. ఏదోలా ప్రైవేటు వాహనంలో వెళ్లాలన్నా.. వీలు కావడం లేదు. రాష్ట్ర సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారని తెలియడం వల్ల ఇక్కడే ఉంటున్నారు. పోనీ అక్కడకు ఎలాగోలా వెళ్లినా 14 రోజులు క్యారంటైన్‌ తప్పదని తెలిసి ఇక్కడే కాలం గడుపుతున్నారు.

* కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి వచ్చిన ఓ మహిళ లాక్‌డౌన్‌తో ఇక్కడ చుట్టాల ఇంట్లో ఉండిపోయారు. ఆమె భర్త కూడా వైజాగ్‌ వెళ్లి అక్కడే ఇరుక్కుపోయారు. కుమార్తె పెళ్లి తేదీ దగ్గర పడటం వల్ల.. వేరే దారి లేక పెళ్లి వాయిదా వేసుకున్నారు.

నగరంలోని చుట్టాల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వచ్చిన వారు కొందరైతే.. ఇంకేదో ముఖ్యమైన పనిమీద వచ్చి ఇరుక్కున్న వారు మరి కొందరు.. ఇలా ఎంతోమంది భాగ్యనగరంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఇక్కడ ఉండలేక.. తమ ఊరికి వెళ్లలేక తీవ్ర వేదన పడుతున్నారు. కరోనా తగ్గి లాక్‌డౌన్‌కు ఎప్పుడు తెర పడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. కరోనా కాస్త... కరుణిస్తే తమ ఊళ్లకు వెళ్లిపోతామని అంటున్నారు. ఇలాంటి వారు నిత్యం పదుల సంఖ్యలో ప్రభుత్వ కాల్‌ సెంటర్లతోపాటు, పలు కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. తమను ఎలాగైనా పంపాలని వేడుకుంటున్నారు. కొందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసేది ఏమీ లేక అధికారులు వారికి సర్ది చెబుతున్నారు. కొందర్ని కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.

ఎక్కువగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తుండటం వల్ల రాష్ట్ర సరిహద్దులే కాదు.. జిల్లాల హద్దుల్ని కూడా మూసి వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవర్ని అనుమతించడం లేదు. ఒకవేళ ఏదోలా వచ్చినా సరే 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఫలితంగా ఇక్కడే ఉంటూ రోజులు.. గంటలు.. క్షణాలు లెక్కపెడుతున్నారు. గతంలో సొంతూళ్లకు వెళ్లే వారికి పాసులు జారీ చేసిన నగర పోలీసులు.. తరువాత నిలుపుదల చేశారు. ఏదైనా అత్యవసమైతే మానవతా దృష్టితో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అనుమతి ఇస్తున్నా.. ఆయా రాష్ట్రాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ అధికారి అనుమతులతో ఏపీ వెళ్లడానికి ఓ ప్రైవేటు వాహనం అద్దెకు తీసుకున్నారు. తీరా అక్కడికి చేరుకోగానే పోలీసులు అడ్డగించారు. ఎన్ని చెప్పినా.. పంపేది లేదని చెప్పడం వల్ల వేరే దారి లేక తిరిగి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఒక్క ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వారు ఎందరో.. దీనితో వేరే దారి లేక బంధువులు, తెలిసిన వారు.. స్నేహితుల ఇళ్ల వద్ద కాలం గడుపుతున్నారు.

అందరిదీ అదే దారి...

difficulties of migrants due to corona lock down
ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక!

ఇలా ముఖ్యమైన పనులతో వచ్చి ఇరుక్కున్న వారే కాదు... పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారు కూడా సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే కాలి నడకన వెళ్లిపోతున్నారు. దూరం ఎంతైనా.. ఎండకు లెక్క చేయకుండా పిల్లాపాపలతో ఊరి బాట పడుతున్నారు. తీరా సొంతూళ్లు చేరుకున్నాక కూడా కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి వారిని అధికారులు గుర్తించి అక్కడ 14-20 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతున్నారు. సొంతూళ్లే కాబట్టి... కొందరైతే క్వారంటైన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గినా ఇప్పటికిప్పుడు ఉపాధి దొరుకుతుందనే ఆశలు లేవు. ఇంకా కొంత సమయం పడుతుంది.

ఇదీ చూడండి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

* ఎస్‌ఆర్‌నగర్‌ బంధువుల ఇంటికి చెన్నై నుంచి వచ్చిన ఓ మహిళ నెల రోజులుగా ఇక్కడే ఇరుక్కుపోయారు. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల అప్పటి నుంచి ఇక్కడే కాలం గడుపుతున్నారు. తన కుమారుడు కువైట్‌లో ఉండటం వల్ల.. కోడలు, మనుమలు చెన్నైలో ఉంటున్నారు. వారు అక్కడ... ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటూ తీవ్రంగా మదన పడుతున్నారు. ఎప్పటిలోగా లాక్‌డౌన్‌ పూర్తి అవుతుందోనని ఎదురు చూస్తున్నారు.

* ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనాథ్‌రెడ్డి విద్యానగర్‌లోని తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. ఏదోలా ప్రైవేటు వాహనంలో వెళ్లాలన్నా.. వీలు కావడం లేదు. రాష్ట్ర సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారని తెలియడం వల్ల ఇక్కడే ఉంటున్నారు. పోనీ అక్కడకు ఎలాగోలా వెళ్లినా 14 రోజులు క్యారంటైన్‌ తప్పదని తెలిసి ఇక్కడే కాలం గడుపుతున్నారు.

* కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి వచ్చిన ఓ మహిళ లాక్‌డౌన్‌తో ఇక్కడ చుట్టాల ఇంట్లో ఉండిపోయారు. ఆమె భర్త కూడా వైజాగ్‌ వెళ్లి అక్కడే ఇరుక్కుపోయారు. కుమార్తె పెళ్లి తేదీ దగ్గర పడటం వల్ల.. వేరే దారి లేక పెళ్లి వాయిదా వేసుకున్నారు.

నగరంలోని చుట్టాల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వచ్చిన వారు కొందరైతే.. ఇంకేదో ముఖ్యమైన పనిమీద వచ్చి ఇరుక్కున్న వారు మరి కొందరు.. ఇలా ఎంతోమంది భాగ్యనగరంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఇక్కడ ఉండలేక.. తమ ఊరికి వెళ్లలేక తీవ్ర వేదన పడుతున్నారు. కరోనా తగ్గి లాక్‌డౌన్‌కు ఎప్పుడు తెర పడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. కరోనా కాస్త... కరుణిస్తే తమ ఊళ్లకు వెళ్లిపోతామని అంటున్నారు. ఇలాంటి వారు నిత్యం పదుల సంఖ్యలో ప్రభుత్వ కాల్‌ సెంటర్లతోపాటు, పలు కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. తమను ఎలాగైనా పంపాలని వేడుకుంటున్నారు. కొందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసేది ఏమీ లేక అధికారులు వారికి సర్ది చెబుతున్నారు. కొందర్ని కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.

ఎక్కువగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తుండటం వల్ల రాష్ట్ర సరిహద్దులే కాదు.. జిల్లాల హద్దుల్ని కూడా మూసి వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవర్ని అనుమతించడం లేదు. ఒకవేళ ఏదోలా వచ్చినా సరే 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఫలితంగా ఇక్కడే ఉంటూ రోజులు.. గంటలు.. క్షణాలు లెక్కపెడుతున్నారు. గతంలో సొంతూళ్లకు వెళ్లే వారికి పాసులు జారీ చేసిన నగర పోలీసులు.. తరువాత నిలుపుదల చేశారు. ఏదైనా అత్యవసమైతే మానవతా దృష్టితో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అనుమతి ఇస్తున్నా.. ఆయా రాష్ట్రాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ అధికారి అనుమతులతో ఏపీ వెళ్లడానికి ఓ ప్రైవేటు వాహనం అద్దెకు తీసుకున్నారు. తీరా అక్కడికి చేరుకోగానే పోలీసులు అడ్డగించారు. ఎన్ని చెప్పినా.. పంపేది లేదని చెప్పడం వల్ల వేరే దారి లేక తిరిగి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఒక్క ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వారు ఎందరో.. దీనితో వేరే దారి లేక బంధువులు, తెలిసిన వారు.. స్నేహితుల ఇళ్ల వద్ద కాలం గడుపుతున్నారు.

అందరిదీ అదే దారి...

difficulties of migrants due to corona lock down
ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక!

ఇలా ముఖ్యమైన పనులతో వచ్చి ఇరుక్కున్న వారే కాదు... పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారు కూడా సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే కాలి నడకన వెళ్లిపోతున్నారు. దూరం ఎంతైనా.. ఎండకు లెక్క చేయకుండా పిల్లాపాపలతో ఊరి బాట పడుతున్నారు. తీరా సొంతూళ్లు చేరుకున్నాక కూడా కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి వారిని అధికారులు గుర్తించి అక్కడ 14-20 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతున్నారు. సొంతూళ్లే కాబట్టి... కొందరైతే క్వారంటైన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గినా ఇప్పటికిప్పుడు ఉపాధి దొరుకుతుందనే ఆశలు లేవు. ఇంకా కొంత సమయం పడుతుంది.

ఇదీ చూడండి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.