ETV Bharat / state

కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

తమ కాలనీలో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని... అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ అమీర్​పేట్​లోని ధరంకరం వాసులు నిరసన తెలిపారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు.

author img

By

Published : Jan 28, 2020, 2:16 PM IST

dhramkaram colony members strike about their colony issues in ameerpet
'మా కాలనీ సమస్యలు వెంటనే తీర్చండి'

అమీర్​పేట్​లోని ధరంకరం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై వ్యాపారులు చెత్త వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. ముఖ్యంగా కాలనీలో వీధి కుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన చేస్తామని వెల్లడించారు.

'మా కాలనీ సమస్యలు వెంటనే తీర్చండి'
విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ శేషు కుమారి అధికారులతో కలిసి అక్కడికి వచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు.

ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!

అమీర్​పేట్​లోని ధరంకరం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై వ్యాపారులు చెత్త వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. ముఖ్యంగా కాలనీలో వీధి కుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన చేస్తామని వెల్లడించారు.

'మా కాలనీ సమస్యలు వెంటనే తీర్చండి'
విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ శేషు కుమారి అధికారులతో కలిసి అక్కడికి వచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు.

ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.