ETV Bharat / state

ఇవాళ్టి నుంచి బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ

author img

By

Published : Mar 20, 2021, 5:08 AM IST

ఉభయసభల్లో బడ్జెట్‌పై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షలా 30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ఈనెల 18న ప్రవేశపెట్టింది.

ఇవాళ్టి నుంచి బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ
ఇవాళ్టి నుంచి బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ

బడ్జెట్‌పై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షలా 30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ఈనెల 18న ప్రవేశపెట్టింది. మరుసటి రోజు సెలవు తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు సమావేశం కానున్నాయి.

నేటి నుంచి శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలతోపాటు శూన్యగంట కూడా ఉంటుంది. అనంతరం రెండు సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపడతారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విదేశీ ఉపకారవేతనాలు, ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహం, మైనార్టీలకు బ్యాంకు రుణాలు, టీఎస్ బీపాస్ విధానం, రేషన్ కార్డుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో కూరగాయల సాగు, డయాగ్నోస్టిక్స్ మినీ హబ్స్, టాస్ ఏర్పాటు, జీరో ఎఫ్ఐఆర్, ప్రైవేటు విద్యాసంస్థలకు డీమ్డ్ హోదా, విద్యుత్ చార్జీల పెంపు అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విద్యుత్ నియంత్రణ మండలితోపాటు విద్యుత్ సంస్థలకు చెందిన నివేదికలను ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉభయసభల ముందు ఉంచనున్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

బడ్జెట్‌పై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షలా 30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ఈనెల 18న ప్రవేశపెట్టింది. మరుసటి రోజు సెలవు తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు సమావేశం కానున్నాయి.

నేటి నుంచి శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలతోపాటు శూన్యగంట కూడా ఉంటుంది. అనంతరం రెండు సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపడతారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విదేశీ ఉపకారవేతనాలు, ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహం, మైనార్టీలకు బ్యాంకు రుణాలు, టీఎస్ బీపాస్ విధానం, రేషన్ కార్డుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో కూరగాయల సాగు, డయాగ్నోస్టిక్స్ మినీ హబ్స్, టాస్ ఏర్పాటు, జీరో ఎఫ్ఐఆర్, ప్రైవేటు విద్యాసంస్థలకు డీమ్డ్ హోదా, విద్యుత్ చార్జీల పెంపు అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విద్యుత్ నియంత్రణ మండలితోపాటు విద్యుత్ సంస్థలకు చెందిన నివేదికలను ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉభయసభల ముందు ఉంచనున్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.