ETV Bharat / state

స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోండి: సీపీ సజ్జనార్ - జీహెచ్​ఎంసీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ సీపీ సమీక్ష

జీహెచ్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు సిబ్బందితో సైబరాదాబ్ సీపీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.

cyberabad cp sajjanar review on ghmc elections arrangements
స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోండి: సీపీ సజ్జనార్
author img

By

Published : Nov 25, 2020, 1:59 PM IST

ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. సైబరాబాద్​ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీల్లోని 2,569 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాజేంద్రనగర్, మైలార్​ దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి... బందోబస్తుపై సూచనలు చేశారు.

ఇప్పటికే గుర్తించిన 243 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న ఆయన... పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్​కు చేరవేస్తారన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా సైబరాబాద్​లోని 38 డివిజన్లకు దాదాపుగా 13,500 మంది పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీరితో పాటు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు.

ఇదీ చదవండి: పుస్తకాలను చదవడమే కాదు.. ఈ పరికరంతో వినవచ్చు!

ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. సైబరాబాద్​ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీల్లోని 2,569 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాజేంద్రనగర్, మైలార్​ దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి... బందోబస్తుపై సూచనలు చేశారు.

ఇప్పటికే గుర్తించిన 243 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న ఆయన... పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్​కు చేరవేస్తారన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా సైబరాబాద్​లోని 38 డివిజన్లకు దాదాపుగా 13,500 మంది పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీరితో పాటు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు.

ఇదీ చదవండి: పుస్తకాలను చదవడమే కాదు.. ఈ పరికరంతో వినవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.