సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. సామాజిక మాధ్యమాలు యువతకు ఎంత ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ... వారి అతితెలివికి మాత్రం ఆయుధాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన ఓ యువతి సరికొత్త వ్యూహంతో మోసానికి పాల్పడింది.
పాఠశాలలే తన టార్గెట్...
పలు ప్రైవేట్ స్కూళ్లకు చెందిన అధికారిన ఫేస్బుక్ పేజీల నుంచి ఫొటోలనే ఆయుధంగా మార్చుకుంది ఆ కిలేడి. సమావేశాలు, వేడుకలకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి... యాజమాన్యానికి పంపిస్తోంది. తాను సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్లు వారిని నమ్మించి... సామాజిక మాధ్యమాల నుంచి ఆ ఫొటోలను తీసేసేందుకు అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని కొన్ని స్కూళ్లను కూడా డిమాండ్ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం బయటపడింది.
ఫోన్లో 225 స్కూళ్ల గ్రూపులు...
దర్యాప్తు చేసిన పోలీసులు ఈ సైబర్ కిలేడిని అరెస్టు చేశారు. యువతిని విచారించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. నిందితురాలి చరవాణిలో సుమారు 225కు పైగా పాఠశాలల గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే టెక్నాలజీని వాడుకుని నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ అడిషనల్ డీజీపీ రఘువీర్ తెలిపారు.
ఇవీ చూడండి: అమృతను పెళ్లి చేసుకుంటా..అగంతకుడి సీసీ వీడియో..