ETV Bharat / state

ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష

రాష్ట్రంలో ఆహార భద్రతపై ప్రధాన కార్యదర్శి​ ఎస్కే జోషితో పుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఛైర్​ పర్సన్​ రీటా టియోటియా సమీక్షించారు. భద్రత తనిఖీలు, సాంకేతికత వినియోగం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఆహార భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్​ జోషి వివరించారు.

author img

By

Published : May 28, 2019, 7:09 PM IST

ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష
ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష

సచివాలయంలో ఆహార భద్రతపై సీఎస్​ జోషితో పుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఛైర్​పర్సన్​ రీటా టియోటియా సమీక్షించారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు చేపడుతున్న కార్యక్రమాలపై సీఎస్​ ఆమెకు వివరించారు. ఆహార భద్రత, సాంకేతికత వినియోగం, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రాష్ట్ర అధికారులకు వివరించారు. ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పోర్టల్​ పనితీరు, ఆహార పదార్థాల్లో కల్తీ నిరోధం, అనుమతుల జారీ, తనిఖీలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించామని సీఎస్​ తెలిపారు. పుడ్​ బిజినెస్​ ఆపరేటర్లను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోం కిచెన్​, రోడ్లపై ఆహారపదార్థాల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆహార భద్రత విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్​ జోషి ఆదేశించారు.

ఇవీ చూడండి: చేప మందు ప్రసాదం పంపిణీపై ప్రభుత్వం సమీక్ష

ఆహార భద్రతపై సచివాలయంలో సమీక్ష

సచివాలయంలో ఆహార భద్రతపై సీఎస్​ జోషితో పుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఛైర్​పర్సన్​ రీటా టియోటియా సమీక్షించారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు చేపడుతున్న కార్యక్రమాలపై సీఎస్​ ఆమెకు వివరించారు. ఆహార భద్రత, సాంకేతికత వినియోగం, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రాష్ట్ర అధికారులకు వివరించారు. ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పోర్టల్​ పనితీరు, ఆహార పదార్థాల్లో కల్తీ నిరోధం, అనుమతుల జారీ, తనిఖీలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించామని సీఎస్​ తెలిపారు. పుడ్​ బిజినెస్​ ఆపరేటర్లను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోం కిచెన్​, రోడ్లపై ఆహారపదార్థాల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆహార భద్రత విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్​ జోషి ఆదేశించారు.

ఇవీ చూడండి: చేప మందు ప్రసాదం పంపిణీపై ప్రభుత్వం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.