ETV Bharat / state

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం

author img

By

Published : Feb 18, 2021, 10:24 PM IST

తిరుపతి వేదికగా మార్చి నాలుగో తేదీన జరగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం
మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం

అంతర్రాష్ట్ర సంబంధాలు, సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, విభజన హామీల అమలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం మార్చి నాలుగో తేదీన ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశంపై ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత, బస ఏర్పాట్లపై సీఎస్ ఆరా తీశారు.

అంతర్రాష్ట్ర సంబంధాలు, సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, విభజన హామీల అమలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం మార్చి నాలుగో తేదీన ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశంపై ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత, బస ఏర్పాట్లపై సీఎస్ ఆరా తీశారు.

ఇదీ చదవండి: 'మేవరిక్‌ మెస్సయ్య' పుస్తకం ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.