ETV Bharat / state

కరోనా కలవరం... భాగ్యనగరంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

author img

By

Published : Jun 23, 2020, 9:49 PM IST

హైద‌రాబాద్​లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం కూడా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్‌ ఇప్పుడు జంటనగరాల్లోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ కార్మికులు ఇవాళ కూడా కరోనా బారినపడ్డారు.

corona cases increased in hyderabad
భాగ్యనగరంలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులు

జంట న‌గ‌రాల్లో కరోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం అల్లాపూర్ డివిజన్​లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒకే సారి 46 మందికి పాజిటివ్ నిర్ధరణ అవటంతో ఆస్పత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితుల్లో ఐదు నెలలు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు.

ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ఆయాకు వైరస్​ సోకింది. జీహెచ్ఎంసీ యూసుఫ్​గుడా సర్కిల్-19 పరిధిలో 41 మందికి కరోనా సోకింది. వైరస్​పై ఇంటింటి సర్వే చేసిన ఆశా వర్కర్ల‌కు మహమ్మారి సోకింది. బోరబండ డివిజన్​లో 11, వెంగళరావునగర్‌ డివిజన్​లో 6, ఎర్రగడ్డ డివిజన్​లో 11, యూసుఫ్​గూడ డివిజన్​లో 8, రహ్మత్ నగర్ డివిజన్​లో 5, హ‌య‌త్​న‌గ‌ర్​లో 5, పెద్ద అంబ‌ర్​పేట్​లో రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

శంషాబాద్​లో కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధిలో 34 మందికి వైరస్​ సోకింది. సెలూన్ షాప్ నిర్వహకుడితో పాటు మరో న‌లుగురికి వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీదేవి నర్సింగ్ హోమ్​ వైద్యుడికి, సిబ్బందికి కరోన నిర్ధరణ అయింది. అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో 12 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంబర్‌పేట తురబ్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్ పరిధిలో ముగ్గురు కరోనాతో మ‌ర‌ణించారు.

ఇవీ చూడండి: 'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'

జంట న‌గ‌రాల్లో కరోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం అల్లాపూర్ డివిజన్​లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒకే సారి 46 మందికి పాజిటివ్ నిర్ధరణ అవటంతో ఆస్పత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితుల్లో ఐదు నెలలు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు.

ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ఆయాకు వైరస్​ సోకింది. జీహెచ్ఎంసీ యూసుఫ్​గుడా సర్కిల్-19 పరిధిలో 41 మందికి కరోనా సోకింది. వైరస్​పై ఇంటింటి సర్వే చేసిన ఆశా వర్కర్ల‌కు మహమ్మారి సోకింది. బోరబండ డివిజన్​లో 11, వెంగళరావునగర్‌ డివిజన్​లో 6, ఎర్రగడ్డ డివిజన్​లో 11, యూసుఫ్​గూడ డివిజన్​లో 8, రహ్మత్ నగర్ డివిజన్​లో 5, హ‌య‌త్​న‌గ‌ర్​లో 5, పెద్ద అంబ‌ర్​పేట్​లో రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

శంషాబాద్​లో కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధిలో 34 మందికి వైరస్​ సోకింది. సెలూన్ షాప్ నిర్వహకుడితో పాటు మరో న‌లుగురికి వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీదేవి నర్సింగ్ హోమ్​ వైద్యుడికి, సిబ్బందికి కరోన నిర్ధరణ అయింది. అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో 12 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంబర్‌పేట తురబ్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్ పరిధిలో ముగ్గురు కరోనాతో మ‌ర‌ణించారు.

ఇవీ చూడండి: 'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.