హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు... మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో గన్ ఫౌండ్రిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో 150 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా గన్ ఫౌండ్రిలో ఉన్న వసతి గృహాలలో తనిఖీ చేసిన డీసీపీ... యజమానులకు, వసతి గృహాల్లో నివసించే విద్యార్థులకు తగు జాగ్రత్తలు సూచించారు.
ఇవీ చూడండి:మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా