ETV Bharat / state

'పీసీసీ పదవి కావాలంటే... అధిక స్థానాలు గెలవాల్సిందే' - కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవి

కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు పురపాలక ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. పదవి కోసం... అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను గెలిపించుకొని అధిష్ఠానం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే హైదరాబాద్ నుంచి తమ నియోజకవర్గాలకు మకాం మార్చి... పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు.

congress on municipal elections winngs
'పీసీసీ పదవి కావాలంటే... అధిక స్థానాలు గెలవాల్సిందే'
author img

By

Published : Jan 7, 2020, 5:22 AM IST

Updated : Jan 7, 2020, 9:24 AM IST

రాష్ట్రంలో పురపాలక, నగరపాలక ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేయ్యాలని... అధిష్ఠానం ఆదేశించడంతో నాయకులంతా ఆ దిశలో శ్రమిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. తమ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో అధిక స్థానాల్లో గెలుపొంది అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. లేదంటే పీసీసీ రేసులో వెనుకబడి పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ తెరాస, భాజపాను ఎలా ఎదురుకోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

'పీసీసీ పదవి కావాలంటే... అధిక స్థానాలు గెలవాల్సిందే'
పదవి పొందాలని... మల్కాజిగిరి లోకసభ పరిధిలోని పురపాలిక, నగరపాలిక సంస్థలతోపాటు కొడంగల్ పురపాలక సంఘం బాధ్యతలను కూడా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అప్పగించింది. అధిక స్థానాలను గెలిపించి తన సత్తా చాటేందుకు రేవంత్‌రెడ్డి రాత్రి పగలూ కష్టపడుతున్నారు. భువనగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మునిసిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. ఎక్కువ స్థానాలు గెలిపించి ఏఐసీసీ పదవి పొందాలని ఉత్తమ్ ఆశిస్తున్నారు. గెలిపించే బాధ్యతను తీసుకుని... ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతను మీదేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే మకాం వేసి విస్తృతంగా పర్యటిస్తూ... కార్యకర్తల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలను దక్కించుకోడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని అక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోడానికి కృషి చేస్తున్నారు. అధిక స్థానాలు గెలిచి అధిష్ఠానం దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు.

ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'

రాష్ట్రంలో పురపాలక, నగరపాలక ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేయ్యాలని... అధిష్ఠానం ఆదేశించడంతో నాయకులంతా ఆ దిశలో శ్రమిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. తమ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో అధిక స్థానాల్లో గెలుపొంది అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. లేదంటే పీసీసీ రేసులో వెనుకబడి పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ తెరాస, భాజపాను ఎలా ఎదురుకోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

'పీసీసీ పదవి కావాలంటే... అధిక స్థానాలు గెలవాల్సిందే'
పదవి పొందాలని... మల్కాజిగిరి లోకసభ పరిధిలోని పురపాలిక, నగరపాలిక సంస్థలతోపాటు కొడంగల్ పురపాలక సంఘం బాధ్యతలను కూడా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అప్పగించింది. అధిక స్థానాలను గెలిపించి తన సత్తా చాటేందుకు రేవంత్‌రెడ్డి రాత్రి పగలూ కష్టపడుతున్నారు. భువనగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మునిసిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. ఎక్కువ స్థానాలు గెలిపించి ఏఐసీసీ పదవి పొందాలని ఉత్తమ్ ఆశిస్తున్నారు. గెలిపించే బాధ్యతను తీసుకుని... ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతను మీదేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే మకాం వేసి విస్తృతంగా పర్యటిస్తూ... కార్యకర్తల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలను దక్కించుకోడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని అక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోడానికి కృషి చేస్తున్నారు. అధిక స్థానాలు గెలిచి అధిష్ఠానం దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు.

ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'

Tg_hyd_11_07_cong_muncipal_elections_serious-pkg_3038066 Reporter: M.Tirupal Reddy () తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు పురపాలక ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. పీసీసీ పదవి ఆశిస్తున్న నేతలు అధిక సంఖ్యలో మునిసిపాలిటీలను గెలిపించుకొని అధిష్టానం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే…పురపాలక ఎన్నికలను సవాల్ గా తీసుకున్న నాయకులు హైదరాబాద్ నుంచి తమ నియోజకవర్గాలకు మకాం మార్చి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు…..లుక్ వాయిస్ ఓవర్1: తెలంగాణ రాష్ట్రం లో పురపాలక, నగరపాలక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చెయ్యాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో నాయకులంతా ఆ దిశలో పని చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. తమ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో అధిక స్థానాల్లో గెలుపొంది అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు దీనిని అధిష్టానం వద్ద అదనపు అర్హత పొందాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు దక్కించుకోలేక పోతే పీసీసీ రేస్ లో వెనుకబడి పోతామన్న బెంగ కొందరు నాయకులను వెంటాడుతోంది. అధికార తెరాస కారుకు ...బ్రేకులు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీనితో పీసీసీ పదవి ఆశిస్తున్న నేతలు తమకు అప్పగించిన పురపాలక, నగరపాలక సంస్థల్లో పార్టీని గెలిపించి తమ సత్తా చాటి అధిష్టానం దృష్టిలో పడేందుకు ఉవీళ్ళురుతున్నారు. ఇప్పటికే ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీని, భాజాపా ను ఎలా ఎదురుకోవాలో దిశానిర్దేశం చేస్తున్నారు. వాయిస్ ఓవర్2: మల్కాజిగిరి లోకసభ పరిధిలోని పురపాలిక, నగరపాలిక సంస్థలతోపాటు కొడంగల్ పురపాలక సంఘం బాధ్యతలను కూడా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అప్పగించింది. అధిక స్థానాలను గెలిపించి తన సత్తా చాటేందుకు రేవంత్ రెడ్డి రాత్రి పగలూ కష్టపడుతున్నారు. భువనగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ విజయమే లక్ష్యంగా కార్యకర్తలకు, స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మునిసిపాలిటీ లను గెలిపించుకునే బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. తమ పరిధిలో ఎక్కువ మున్సిపాలిటీలను గెలిపించి తన సత్తా చాటి పిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఏఐసీసీలో పదవి పొందాలని ఉత్తమ్ ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మునిసిపాలిటీలను గెలిపించుకునే భాద్యతను మిదేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే మకాం వేసి విస్తృతంగా పర్యటిస్తూ...కార్యకర్తల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలను దక్కించుకోడానికి వ్యూహా రచన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని అక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోడానికి కృషి చేస్తున్నారు. వాయిస్ ఓవర్3: తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేతలు... ఎక్కవ స్థానాలు గెలిపించుకొని హైకమాండ్ వద్ద సమర్ధులమని నిరూపించుకోడానికి ఎవ్వరి స్థాయిలో వారు కృషి చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి నెలకొంది.
Last Updated : Jan 7, 2020, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.