ETV Bharat / state

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!

రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా ఉండేందుకు తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ విలీనమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేల వరుస వలసలతో కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటామని అధికారికంగానే వెల్లడించారు. ఇదే బాటలో మరికొంత ఎమ్మెల్యేలు అడుగులు వేయబోతున్నట్లు  తెలుస్తోంది.

author img

By

Published : Mar 15, 2019, 9:08 AM IST

Updated : Mar 15, 2019, 2:45 PM IST

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!
సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి చెయ్యిచ్చి కారెక్కుతున్నారు. ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సీనియర్ నేత సబితతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు శాసనసభ్యులు అధికార పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పావులు కదుపుతోన్న తెరాస...

రాష్ట్రంలో తెరాస అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా అమలవుతుండటంతో హస్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని తెరాస వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా గల్లంతు చేయటమే లక్ష్యాన్ని కనిపిస్తోంది.ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ పార్టీని దెబ్బతీయాలని తెరాస పావులు కదుపుతోంది.

ప్రతిపక్షహోదాను గల్లంతు చేసేందుకే తెరాస వ్యూహం!

శాసనసభ్యుల్లో పదోవంతు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. కనీసం 12 లేదా అంతకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండాలి. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు గులాబీ కండువా కప్పుకుంటే... కాంగ్రెస్‌కు మిగిలేది 13మంది. ఇంకిందరు దూరమైతే శాసనసభలో ప్రతిపక్షహోదా పోయినట్లే. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాతో పాటు ఆ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్​ రెడ్డిల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ ఇద్దరు లేకుంటే మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేనట్లే.

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి చెయ్యిచ్చి కారెక్కుతున్నారు. ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సీనియర్ నేత సబితతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు శాసనసభ్యులు అధికార పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పావులు కదుపుతోన్న తెరాస...

రాష్ట్రంలో తెరాస అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా అమలవుతుండటంతో హస్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని తెరాస వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా గల్లంతు చేయటమే లక్ష్యాన్ని కనిపిస్తోంది.ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ పార్టీని దెబ్బతీయాలని తెరాస పావులు కదుపుతోంది.

ప్రతిపక్షహోదాను గల్లంతు చేసేందుకే తెరాస వ్యూహం!

శాసనసభ్యుల్లో పదోవంతు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. కనీసం 12 లేదా అంతకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండాలి. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు గులాబీ కండువా కప్పుకుంటే... కాంగ్రెస్‌కు మిగిలేది 13మంది. ఇంకిందరు దూరమైతే శాసనసభలో ప్రతిపక్షహోదా పోయినట్లే. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాతో పాటు ఆ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్​ రెడ్డిల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ ఇద్దరు లేకుంటే మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేనట్లే.

FILE:TG_KRN_01_15_UBI LO 12 CRORES_GALLANTU_AV_R20 FROM:MD.Aleemuddin,karimnagar Camera:Thirupathi -------------------------- () కరీంనగర్లోని యూనియన్ బ్యాంకు లో భారీగా నగదు గల్లంతయింది. యు బి ఐ కరెన్సీ బ్రాంచ్ మేనేజర్ సురేష్ కుమార్ కమిషన్ కోసం కక్కుర్తి పడి బయట వ్యక్తులకు 12 కోట్ల రూపాయలు చేబదులు ఇచ్చి మోసపోయినట్లు సమాచారం. రాజీవ్ చౌక్ లోని చెస్ట్ బ్యాంకుకు 27 బ్రాంచీల నుంచి నగదును తరలిస్తుంటారు. మళ్లీ ఏ బ్రాంచ్లో అవసరమైన రెండు వ్యాన్ లో సెక్యూరిటీ గార్డుల భద్రత మధ్య డబ్బు తరలిస్తుంటారు. ఈ వ్యవహారమంతా మేనేజర్ అధీనంలో ఉంటుంది.అయితే ఇక్కడే మోసానికి తెరలేచింది. కరెన్సీ బ్రాంచ్ మేనేజర్ సురేష్ కుమార్ హైదరాబాద్ నివాసి. ఆయనకు ముంబై జబల్పూర్ కు చెందిన పలువురు ఫైనాన్స్ వ్యాపారులతో పరిచయాలు ఉన్నాయి. నగదు సర్దుబాటు చేస్తే కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని ప్రతిగా పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తామని చెప్పడంతో ఈ నగదు ఇచ్చినట్లు సమాచారం. వ్యవహారం ఈ నెల 11వ తేదీన ఆడిట్లో తేలడంతో ఆడిట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత స్థానిక ఒకటవ ఠాణా పోలీసులు విచారణ జరిపి ఈ వ్యవహారం సీబీఐ పరిధిలోకి వస్తుందని తేల్చారు. ఈ విషయం పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి దృష్టికి ఈటీవీ తీసుకెళ్లగా ఆ వ్యవహారం సీబీఐ పరిధిలోకి వస్తుందని సమాధానం చెప్పారు..visuals
Last Updated : Mar 15, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.