తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మరోసారి మోసం చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశాలిస్తున్నారని ఆరోపించారు.
ప్రగతిభవన్లో పదవులు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నారంటూ రాములునాయక్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎస్టీలు తమ ప్రభావాన్ని చూపాలన్నారు. నాయిని కుటుంబాన్ని క్షోభకు గురిచేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు 6 నెలలు కూడా ఆగకుండా పదవి ఇచ్చారని.. శ్రీకాంత్చారి తల్లి శంకరమ్మకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రతిసారి అమెను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్లో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట