ETV Bharat / state

లాక్​డౌన్​లో విధించిన జరిమానాలు రద్దు చేయండి: నిరంజన్​

author img

By

Published : Jun 8, 2021, 3:27 PM IST

ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్​డౌన్​లో బయటకు వచ్చారని.. పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్​ అన్నారు. వారిపై విధించిన జరిమానాలను రద్దుచేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

congress leader niranjan
congress leader niranjan letter to cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్​కు పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్​ లేఖ రాశారు. లాక్​డౌన్​ సమయంలో విధించిన చలాన్లు, జరిమానాలను రద్దుచేయాలని.. ఈ మేరకు కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ప్రజల నుంచి వసూలు చేసిన నగదునూ తిరిగి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జప్తు చేసిన వాహనాలనూ ఎలాంటి జరిమానా విధించకుండా వాహనదారులకు అప్పగించాలని కోరారు.

లాక్​డౌన్​లో బయటకు వచ్చిన వారు ఉద్దేశపూర్వకంగా రాలేదని.. తప్పని పరిస్థితుల్లోనే వచ్చారన్నారు. ఉపాధి లేక ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో జరిమానాల రద్దు.. వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తే ప్రజలకు కొంతైనా ఊరట కలుగుతుందని నిరంజన్​ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను కోరారు.

ఇవీచూడండి: Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల

ముఖ్యమంత్రి కేసీఆర్​కు పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్​ లేఖ రాశారు. లాక్​డౌన్​ సమయంలో విధించిన చలాన్లు, జరిమానాలను రద్దుచేయాలని.. ఈ మేరకు కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ప్రజల నుంచి వసూలు చేసిన నగదునూ తిరిగి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జప్తు చేసిన వాహనాలనూ ఎలాంటి జరిమానా విధించకుండా వాహనదారులకు అప్పగించాలని కోరారు.

లాక్​డౌన్​లో బయటకు వచ్చిన వారు ఉద్దేశపూర్వకంగా రాలేదని.. తప్పని పరిస్థితుల్లోనే వచ్చారన్నారు. ఉపాధి లేక ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో జరిమానాల రద్దు.. వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తే ప్రజలకు కొంతైనా ఊరట కలుగుతుందని నిరంజన్​ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను కోరారు.

ఇవీచూడండి: Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.