ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని వర్శిటీల పరిధిలోని సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని... యూనివర్శిటీల మధ్య ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.
మే 30 తుది గడువు
ఉమ్మడి పీజీ సెట్ దరఖాస్తుకు మే 30న తుది గడువుగా నిర్ణయించారు. ఓసీ, బీసీలకు పరీక్ష ఫీజు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ.600 వసూలు చేస్తామని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. 500 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 8 వరకు, 2000 రూపాయలతో జూన్ 11 వరకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 30 వేల సీట్ల భర్తీకి 25 కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ