ETV Bharat / state

రెవెన్యూ సంస్కరణలతో ప్రజల ఇబ్బందులు తొలగుతాయి: కేసీఆర్‌

author img

By

Published : Sep 9, 2020, 12:26 PM IST

Updated : Sep 9, 2020, 2:01 PM IST

గ్రామరెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ తీపి కబురు అందించారు. వాళ్లను ఇతర శాఖలో స్కేల్డ్‌ ఎంప్లాయిస్‌గా కొనసాగిస్తామని తెలిపారు. అవినీతి కష్టాల నుంచి ప్రజలను కాపాడలనే ఉద్ధేశ్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల రెవెన్యూ ఉద్యోగులకు ఎలాంటి అభద్రత ఉండదని పేర్కొన్నారు.

CM kcr talk about Revenue reforms in Telangana assembly session 2020
రెవెన్యూ సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయి: కేసీఆర్‌

తెలంగాణలో అనేక రెవెన్యూ సంస్కరణలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ, ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని అసెంబ్లీలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

రెవెన్యూ సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని వివరించారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని హామీనిచ్చారు. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించేందుకే ప్రయత్నమని తెలిపారు. వీఆర్‌వోలను స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తాం... వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని హామీనిచ్చారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, వీఆర్‌వో వ్యవస్థ రద్దు బిల్లులు ప్రవేశపెట్టామని చెప్పారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం మొత్తం చర్చిస్తామన్నారు.

రెవెన్యూ సంస్కరణలపై కేసీఆర్​ ప్రసంగం

ధరణి పోర్టల్‌ 2 భాగాలుగా ఉంటుందని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాలుగా ధరణి పోర్టల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్‌ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ‌ధరణి పోర్టల్‌ నుంచి ఎవరైనా వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని చెప్పారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ విధానంలో రికార్డులు భద్రంగా ఉంటాయని తెలిపారు. అధికారులంతా చట్టం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ప్రజలకు తప్పుతుందని వెల్లడించారు. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థికశాఖ నిబంధనల మేరకు బ్యాంకులో పాస్‌బుక్‌లు ఉంచకూడదని స్పష్టం చేశారు. ఈసీ వివరాలు కూడా ధరణి పోర్టల్‌లో ఉంటాయని తెలిపారు. ఇంతకు ముందున్న చట్టం మంచిదే.. దానిలోని లొసుగులతోనే సమస్య అని అన్నారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టంలో లొసుగులకు అవకాశం లేదని భరోనిచ్చారు.

ధరణి పోర్టల్​పై కేసీఆర్ ప్రసంగం

ఇవీ చూడండి: శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

తెలంగాణలో అనేక రెవెన్యూ సంస్కరణలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ, ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని అసెంబ్లీలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

రెవెన్యూ సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని వివరించారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని హామీనిచ్చారు. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందించేందుకే ప్రయత్నమని తెలిపారు. వీఆర్‌వోలను స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తాం... వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని హామీనిచ్చారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, వీఆర్‌వో వ్యవస్థ రద్దు బిల్లులు ప్రవేశపెట్టామని చెప్పారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం మొత్తం చర్చిస్తామన్నారు.

రెవెన్యూ సంస్కరణలపై కేసీఆర్​ ప్రసంగం

ధరణి పోర్టల్‌ 2 భాగాలుగా ఉంటుందని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాలుగా ధరణి పోర్టల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్‌ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ‌ధరణి పోర్టల్‌ నుంచి ఎవరైనా వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని చెప్పారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ విధానంలో రికార్డులు భద్రంగా ఉంటాయని తెలిపారు. అధికారులంతా చట్టం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ప్రజలకు తప్పుతుందని వెల్లడించారు. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థికశాఖ నిబంధనల మేరకు బ్యాంకులో పాస్‌బుక్‌లు ఉంచకూడదని స్పష్టం చేశారు. ఈసీ వివరాలు కూడా ధరణి పోర్టల్‌లో ఉంటాయని తెలిపారు. ఇంతకు ముందున్న చట్టం మంచిదే.. దానిలోని లొసుగులతోనే సమస్య అని అన్నారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టంలో లొసుగులకు అవకాశం లేదని భరోనిచ్చారు.

ధరణి పోర్టల్​పై కేసీఆర్ ప్రసంగం

ఇవీ చూడండి: శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

Last Updated : Sep 9, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.