ETV Bharat / state

హిమాచల్ గవర్నర్​ను కలిసిన ఏపీ సీఎం జగన్

author img

By

Published : Jan 12, 2021, 4:18 PM IST

విజయవాడలో ఉన్న హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను... ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు.

హిమాచల్ గవర్నర్​ను కలిసిన ఏపీ సీఎం జగన్
హిమాచల్ గవర్నర్​ను కలిసిన ఏపీ సీఎం జగన్

హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కలిశారు. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన దత్తాత్రేయ.. గేట్​వే హోటల్​లో బస చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దత్తాత్రేయతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దత్తాత్రేయకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి.. శాలువాతో జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రి వెంట తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. వారికంటే ముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. దత్తాత్రేయను మార్యాదపూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి: జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కలిశారు. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన దత్తాత్రేయ.. గేట్​వే హోటల్​లో బస చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దత్తాత్రేయతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దత్తాత్రేయకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి.. శాలువాతో జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రి వెంట తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. వారికంటే ముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. దత్తాత్రేయను మార్యాదపూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి: జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.