రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గోషామహాల్ మైదానంలో జరిగిన హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పోలీసు వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కరోనా వేళ పోలీసులు ముందుండి.... ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని.... ఉపాధి లేక ఇబ్బందులు పడిన కూలీలు, కార్మికులకు పోలీసులు భోజనం, నిత్యావసర సరకులు అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలుగా నిలిచిన పోలీసులకు బహుమతులు అందించారు.
ఇదీ చూడండి: రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్