హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సర్వమతాల ప్రబోధనలు శాంతిని, ప్రేమను బోధిస్తున్నాయని మానవ హక్కుల కమిషన్ మాజీ సభ్యుడు జస్టిస్ ఈ.ఇస్మాయిల్ తెలిపారు. గాంధీనగర్లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో సుధా పద్మిని చారిటబుల్ ట్రస్ట్.. క్రిస్మస్ ఉత్సవ వేడుకలు నిర్వహించింది. సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణం గా విద్యార్థులకు ప్రేమ, సౌభ్రాతృత్వాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఇస్మాయిల్ సూచించారు.
ఇవీ చూడండి: 'వామ్మో... మనిషంత పొడవున్న సోరకాయ'