ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలతో సందడిగా మారిన చర్చిలు

author img

By

Published : Dec 25, 2021, 10:01 PM IST

Christmas‌ Celebrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్ని ప్రార్థనలతో సందడిగా మారాయి. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు... ప్రార్థనలు చేశారు. ఏసును స్మరిస్తూ ప్రత్యేక గీతలు ఆలపించి ఉత్సాహంగా గడిపారు.

CHRISTAMAS
CHRISTAMAS
రాష్ట్రవ్యాప్తంగా ఏసు ప్రార్థనలతో సందడిగా మారిన చర్చిలు

Christmas‌ Celebrations in Telangana: రాష్ట్రంలో క్రిస్మస్‌ను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే చర్చిల వద్ద సందడి నెలకొంది. విద్యుద్దీపాలు, నక్షత్రాలతో ప్రార్థనా మందిరాలు కళకళలాడాయి. ఏసుక్రీస్తు రాక వివరిస్తూ... మతపెద్దలు వాక్యోపదేశం చేశారు. ప్రభువును కీర్తిస్తూ ఆరాధన, ప్రార్థనలు చేశారు. చర్చిల్లో ఎక్కడ చూసినా... క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలే దర్శనమిచ్చాయి. చిన్నపెద్దాతేడా లేకుండా అంతా ఒకచోట చేరి కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

క్రిస్టియన్లందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్... పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్నిచాటిన ఏసుక్రీస్తు బోధనలు... ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల కాంతుల విద్యుద్ధీపాలతో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. బోయిన్‌పల్లి, రసూప్‌పుర, మారేడ్‌పల్లి ప్రాంతాల్లోని క్రిస్టియన్లకు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న క్రిస్టియన్లకు కానుకలు అందజేశారు.

మెదక్ చర్చిలో ఘనంగా...

దక్షిణ భారతదేశంలోని మెథడిస్ట్ చర్చిల్లో అతిపెద్దదిగా పేరొందిన జహీరాబాద్ మెథడిస్ట్ చర్చిను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సికింద్రాబాద్​లోని సెయింట్ ఆన్స్ చర్చిలో క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిద్ధిపేటలోని CSI చర్చిలో క్రైస్తవ మతపెద్దలు ఏసు క్రీస్తును కీర్తిస్తూ ఆరాధన మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కన్నుల పండువగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి... కొవ్వత్తులు వెలిగించి మొక్కులు తీసుకున్నారు. అనంతరం... చర్చ్‌ ప్రాంగణంలోని పశువుల పాకను దర్శించుకుని... గురువుల దీవెనలు అందుకున్నారు. వేడుకల సందర్భంగా చర్చ్‌ వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు... చర్చిలో కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, పలువురికి పండుగ కానుకలను అందజేశారు. ఏసు ప్రభువు చెప్పిన సూక్తులను చదవటమే కాకుండా... అందరూ ఆచరించాలని మంత్రి సూచించారు.

వేడుకల్లో పువ్వాడ...

ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే ప్రార్థనా మందిరాల వద్ద సందడి నెలకొంది. విద్యుత్‌ దీపాలు, నక్షత్రాలతో ప్రార్థనామందిరాలను అలంకరించారు. ఏసుక్రీస్తు రాక.. ఆయన బోధనలను సంఘకాపారులు వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రిస్మస్‌ గీతాలు ఆకట్టుకున్నాయి. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ-CSI చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ నీరజ పాల్గొన్నారు.

హనుమకొండలో...

హనుమకొండలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. కాజీపేట.. ఫాతీమా కథిడ్రల్ చర్చిలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. ప్రజలను సన్మార్గంలో నడిపేందుకు క్రీస్తు జన్మించారని... అందరూ అదే బాటలో నడవాలని మతపెద్దలు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా ఏసు ప్రార్థనలతో సందడిగా మారిన చర్చిలు

Christmas‌ Celebrations in Telangana: రాష్ట్రంలో క్రిస్మస్‌ను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే చర్చిల వద్ద సందడి నెలకొంది. విద్యుద్దీపాలు, నక్షత్రాలతో ప్రార్థనా మందిరాలు కళకళలాడాయి. ఏసుక్రీస్తు రాక వివరిస్తూ... మతపెద్దలు వాక్యోపదేశం చేశారు. ప్రభువును కీర్తిస్తూ ఆరాధన, ప్రార్థనలు చేశారు. చర్చిల్లో ఎక్కడ చూసినా... క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలే దర్శనమిచ్చాయి. చిన్నపెద్దాతేడా లేకుండా అంతా ఒకచోట చేరి కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

క్రిస్టియన్లందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్... పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్నిచాటిన ఏసుక్రీస్తు బోధనలు... ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల కాంతుల విద్యుద్ధీపాలతో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. బోయిన్‌పల్లి, రసూప్‌పుర, మారేడ్‌పల్లి ప్రాంతాల్లోని క్రిస్టియన్లకు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న క్రిస్టియన్లకు కానుకలు అందజేశారు.

మెదక్ చర్చిలో ఘనంగా...

దక్షిణ భారతదేశంలోని మెథడిస్ట్ చర్చిల్లో అతిపెద్దదిగా పేరొందిన జహీరాబాద్ మెథడిస్ట్ చర్చిను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సికింద్రాబాద్​లోని సెయింట్ ఆన్స్ చర్చిలో క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిద్ధిపేటలోని CSI చర్చిలో క్రైస్తవ మతపెద్దలు ఏసు క్రీస్తును కీర్తిస్తూ ఆరాధన మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కన్నుల పండువగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి... కొవ్వత్తులు వెలిగించి మొక్కులు తీసుకున్నారు. అనంతరం... చర్చ్‌ ప్రాంగణంలోని పశువుల పాకను దర్శించుకుని... గురువుల దీవెనలు అందుకున్నారు. వేడుకల సందర్భంగా చర్చ్‌ వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు... చర్చిలో కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, పలువురికి పండుగ కానుకలను అందజేశారు. ఏసు ప్రభువు చెప్పిన సూక్తులను చదవటమే కాకుండా... అందరూ ఆచరించాలని మంత్రి సూచించారు.

వేడుకల్లో పువ్వాడ...

ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే ప్రార్థనా మందిరాల వద్ద సందడి నెలకొంది. విద్యుత్‌ దీపాలు, నక్షత్రాలతో ప్రార్థనామందిరాలను అలంకరించారు. ఏసుక్రీస్తు రాక.. ఆయన బోధనలను సంఘకాపారులు వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రిస్మస్‌ గీతాలు ఆకట్టుకున్నాయి. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ-CSI చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ నీరజ పాల్గొన్నారు.

హనుమకొండలో...

హనుమకొండలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. కాజీపేట.. ఫాతీమా కథిడ్రల్ చర్చిలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. ప్రజలను సన్మార్గంలో నడిపేందుకు క్రీస్తు జన్మించారని... అందరూ అదే బాటలో నడవాలని మతపెద్దలు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.