దిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ సమావేశానికి వెళ్లిన వారు వైద్య పరీక్షలు చేయించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మత పెద్దల సహాయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
గత నెల 13న ప్రధాని మన దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగలేదని చెప్పారన్నారు. కరోనా తీవ్రతను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు. మన దేశంలో కరోనా సోకిన విదేశీయులు, విదేశాల నుంచి కరోనా బారిన పడి వచ్చిన స్వదేశీయులను గుర్తించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లిన వారిపై తప్పంతా వేయడం సబబుకాదన్నారు.