ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
దేశ చరిత్రలో నిజామాబాద్ ఎన్నికలు ఓ మైలురాయి - CEO MEETING ON NIZAMABAD
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. తొలిసారి ఈవీఎంలను తయారు చేసిన ఘనత హైదరాబాద్ సొంతమైతే... ఇంత ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను వాడటం దేశ ఎన్నికల చరిత్రలో మరో మైలురాయి అని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
దేశ చరిత్రలో అత్యధికంగా ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ నిర్వహించటం ఇదే మొదటిసారని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై చర్చించారు. నియోజకవర్గంలో పోలింగ్ను సజావుగా జరిపేందుకు 600 మంది నిపుణులను కేటాయిస్తున్నట్లు ఉమేష్ సిన్హా వివరించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 1788 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2వేల కంట్రోల్ యూనిట్లు , 2వేల వీవీప్యాట్లు సిద్ధం చేస్తున్నట్లు సిన్హా తెలిపారు.
Last Updated : Apr 2, 2019, 4:25 PM IST
TAGGED:
CEO MEETING ON NIZAMABAD