ETV Bharat / state

'డిగ్రీ కోసమే ఇంజినీరింగ్ వద్దు... ప్రావీణ్యం సంపాదించాలి'

author img

By

Published : Oct 4, 2020, 1:31 PM IST

Updated : Oct 4, 2020, 1:39 PM IST

ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్​ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. కేవలం డిగ్రీ కోసమే ఇంజినీరింగ్ కాకుండా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు.

career guidance programme in hyderabad by navin mittal
'డిగ్రీ కోసమే ఇంజనీరింగ్ వద్దు... ప్రావీణ్యం సంపాదించాలి'

కేవలం డిగ్రీ కోసమే ఇంజినీరింగ్ విద్య కాకుండా..భవిష్యత్​లో ఉన్న అవకాశాలను బట్టి కోర్సులు తీసుకొని ప్రావీణ్యం సంపాదించాలని తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధులకు ఇది చాలా ఉపయోగపడుతుందని...ప్రతిఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇప్పటికే నాణ్యమైన విద్య అందిస్తోన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రెండు పీజీడీఎం కోర్సులను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ మిట్టల్​తో పాటు యాజమాన్య టెక్నికల్ ఇంఛార్జీ నాగభూషణరావు, డైరెక్టర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కేవలం డిగ్రీ కోసమే ఇంజినీరింగ్ విద్య కాకుండా..భవిష్యత్​లో ఉన్న అవకాశాలను బట్టి కోర్సులు తీసుకొని ప్రావీణ్యం సంపాదించాలని తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధులకు ఇది చాలా ఉపయోగపడుతుందని...ప్రతిఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇప్పటికే నాణ్యమైన విద్య అందిస్తోన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రెండు పీజీడీఎం కోర్సులను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ మిట్టల్​తో పాటు యాజమాన్య టెక్నికల్ ఇంఛార్జీ నాగభూషణరావు, డైరెక్టర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జీహెచ్​ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం

Last Updated : Oct 4, 2020, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.