హైదరాబాద్లోని హైదర్నగర్ బస్స్టాప్ వద్ద షెల్టర్ నిర్మించానని.. దానిని మెట్రో పనుల సమయంలో తొలగించి ఇంతవరకూ నిర్మించలేదని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆరోపించారు.
నాలుగేళ్లు పూర్తైనా ఇప్పటి వరకు షెల్టర్ నిర్మించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్షెల్టర్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దత్తత తీసుకొన్న డివిజన్లోనే సమస్యలు కోకొల్లలుగా ఉంటే.. మరి సాధారణ డివిజన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.