ETV Bharat / state

Free Current Controversy in Telangana : రేవంత్‌ వ్యాఖ్యల పట్ల... నిరసనల గళమెత్తిన గులాబీదళం

author img

By

Published : Jul 12, 2023, 10:11 AM IST

Brs On Revanth Reddy Comments : ఉచిత విద్యుత్‌ పంపిణీపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీదళం కదం తొక్కింది. పార్టీ పిలుపుమేరకు రోడ్డెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు.. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కున్న చిత్తశుద్ధికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిరంతరం కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్‌ కడుపు మండుతోందని.. ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్​ పిలుపునిచ్చింది.

BRS Calls Protests in Telangana Against Revanth
BRS Calls Protests in Telangana Against Revanth
రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రాహదారుపై నిరసలు

BRS Protest Against Revanth Reddy Comments : ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. 24 గంటల విద్యుత్ వెలుగుల్ని వదులుకుందామా?.. కటిక చీకట్ల కాంగ్రెస్ కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామో.. ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక పార్టీ అని ట్విట్టర్‌లో విమర్శించిన హరీశ్‌రావు.. రైతులకు కరెంట్‌ వద్దన్న కాంగ్రెస్‌కు ఎన్నికల్లో షాక్‌ ఇవ్వాలన్నారు.

24 Hours Free Current Controversy in Telangana : రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం రైతులకు క్షమాపణ చెప్పించాలని మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 3 గంటల కరెంటు ఇస్తామని రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. రైతులకు కాంగ్రెస్ మొదటి శత్రువని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి మండిపడ్డారు.

జాతీయ రాహదారులపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో.. : సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మన్నె కృశాంక్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఐనవోలులో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయం 9 ఏళ్లల్లో అద్భుత ప్రగతిపథంలో నడుస్తుంటే కాంగ్రెస్‌ నేతల కడుపు మండుతోందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Free Power Cancel Controversy : సిద్దిపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అధికార పార్టీ కార్యకర్తలు.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం రేవంత్​కు ఇష్టం లేదని.. చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కు, కాంగ్రెస్‌కు పడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. రైతులకు మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కాంగ్రెస్‌ను 3 స్థానాల్లోనే గెలిపించాలని కోరారు.

BRS Fires On Revanth Comments : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రైతాంగ సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న కపట ప్రేమ రేవంత్ వ్యాఖ్యలతో బయటపడిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నారాయణపేట జిల్లా మరికల్‌లో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఏమైనా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలేతప్ప.. ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదంటూ కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు సరైంది కాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరులో బీఆర్​ఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి తీరు ఉందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత విమర్శించారు.

ఇవీ చదవండి:

రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రాహదారుపై నిరసలు

BRS Protest Against Revanth Reddy Comments : ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. 24 గంటల విద్యుత్ వెలుగుల్ని వదులుకుందామా?.. కటిక చీకట్ల కాంగ్రెస్ కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామో.. ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక పార్టీ అని ట్విట్టర్‌లో విమర్శించిన హరీశ్‌రావు.. రైతులకు కరెంట్‌ వద్దన్న కాంగ్రెస్‌కు ఎన్నికల్లో షాక్‌ ఇవ్వాలన్నారు.

24 Hours Free Current Controversy in Telangana : రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం రైతులకు క్షమాపణ చెప్పించాలని మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 3 గంటల కరెంటు ఇస్తామని రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. రైతులకు కాంగ్రెస్ మొదటి శత్రువని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి మండిపడ్డారు.

జాతీయ రాహదారులపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో.. : సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మన్నె కృశాంక్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఐనవోలులో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయం 9 ఏళ్లల్లో అద్భుత ప్రగతిపథంలో నడుస్తుంటే కాంగ్రెస్‌ నేతల కడుపు మండుతోందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Free Power Cancel Controversy : సిద్దిపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అధికార పార్టీ కార్యకర్తలు.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం రేవంత్​కు ఇష్టం లేదని.. చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కు, కాంగ్రెస్‌కు పడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. రైతులకు మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కాంగ్రెస్‌ను 3 స్థానాల్లోనే గెలిపించాలని కోరారు.

BRS Fires On Revanth Comments : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రైతాంగ సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న కపట ప్రేమ రేవంత్ వ్యాఖ్యలతో బయటపడిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నారాయణపేట జిల్లా మరికల్‌లో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఏమైనా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలేతప్ప.. ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదంటూ కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు సరైంది కాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరులో బీఆర్​ఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి తీరు ఉందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.