ETV Bharat / state

సులువైన పరిష్కారాల కోసం బ్లాక్​ చైన్​ టెక్నాలజీ

author img

By

Published : Aug 7, 2020, 8:00 AM IST

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్త్రీ నిధి లావాదేవీల పరిరక్షణకు ఉద్దేశించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంచుకున్నారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేద మహిళలకు, అండర్ బ్యాంక్ జనాభాకు ఈ టెక్నాలజీ ద్వారా సాధికారత లభిస్తుందని జయేష్ తెలిపారు.

సులువైన పరిష్కారాల కోసం బ్లాక్​ చైన్​ టెక్నాలజీ
సులువైన పరిష్కారాల కోసం బ్లాక్​ చైన్​ టెక్నాలజీ

పలు జఠిలమైన సమస్యలకు సులువైన పరిష్కారాలు కనుగొనే బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం.. ప్రభుత్వ విభాగాల్లోనూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్త్రీ నిధి లావాదేవీల పరిరక్షణకు ఉద్దేశించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్, పంచాయతీ రాజ్ అండ్ డెవలప్ మెంట్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్త్రీ నిధి డైరెక్టర్​తో కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్​కు చెందిన కాగ్నిటోచైన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ అమలుకు రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేద మహిళలకు, అండర్ బ్యాంక్ జనాభాకు ఈ టెక్నాలజీ ద్వారా సాధికారత లభిస్తుందని జయేశ్​ తెలిపారు.

ఈ ప్లాట్ ఫామ్ కింద స్వయం సహాయక గ్రూపులలో సభ్యులుగా ఉన్న 1.5 లక్షల మంది సభ్యుల.. స్త్రీ నిధి రుణ పంపిణీ, తిరిగి చెల్లింపులు బ్లాక్ చైన్ ప్లాట్ ఫామ్​లో రికార్డు చేయబడతాయి. ఈ బ్లాక్ చైన్ లావాదేవీల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు క్రెడిట్ రేటింగ్ పొందుతారు. తద్వారా వారి రేటింగ్ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదనపు క్రెడిట్ పొందే అర్హతను సభ్యులు పొందే వీలుంటుంది.

ఇవీ చూడండి: నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

పలు జఠిలమైన సమస్యలకు సులువైన పరిష్కారాలు కనుగొనే బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం.. ప్రభుత్వ విభాగాల్లోనూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్త్రీ నిధి లావాదేవీల పరిరక్షణకు ఉద్దేశించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్, పంచాయతీ రాజ్ అండ్ డెవలప్ మెంట్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్త్రీ నిధి డైరెక్టర్​తో కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్​కు చెందిన కాగ్నిటోచైన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ అమలుకు రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేద మహిళలకు, అండర్ బ్యాంక్ జనాభాకు ఈ టెక్నాలజీ ద్వారా సాధికారత లభిస్తుందని జయేశ్​ తెలిపారు.

ఈ ప్లాట్ ఫామ్ కింద స్వయం సహాయక గ్రూపులలో సభ్యులుగా ఉన్న 1.5 లక్షల మంది సభ్యుల.. స్త్రీ నిధి రుణ పంపిణీ, తిరిగి చెల్లింపులు బ్లాక్ చైన్ ప్లాట్ ఫామ్​లో రికార్డు చేయబడతాయి. ఈ బ్లాక్ చైన్ లావాదేవీల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు క్రెడిట్ రేటింగ్ పొందుతారు. తద్వారా వారి రేటింగ్ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదనపు క్రెడిట్ పొందే అర్హతను సభ్యులు పొందే వీలుంటుంది.

ఇవీ చూడండి: నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.