ETV Bharat / state

కానిస్టేబుల్​ దయాకర్​ రెడ్డి కుటుంబానికి భాజపా నేత విరాళం

ఇటీవల కరోనా సోకి మృతిచెందిన పోలీస్​ కానిస్టేబుల్​ కుటుంబానికి కార్వాన్ భాజపా నియోజకవర్గ ఇన్​ఛార్జి అమర్ సింగ్ అండగా నిలిచారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

author img

By

Published : May 27, 2020, 7:59 PM IST

Hyderabad latest news
Hyderabad latest news

కుల్సుంపురా పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తూ కరోనా సోకి మృతి చెందిన కానిస్టేబుల్​ దయాకర్ రెడ్డి కుటుంబానికి కార్వాన్ భాజపా నియోజకవర్గ ఇన్​ఛార్జి అమర్ సింగ్ అండగా నిలిచారు. బుధవారం దయాకర్​ రెడ్డి కుటుంబానికి విరాళంగా 1,01,000/- రూపాయల చెక్కును స్థానిక పోలీస్​ అధికారులకు అందజేశారు. ఈ చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు పంపించాలని అమర్​ సింగ్​ పోలీస్​ అధికారులను కోరారు.

తెలంగాణ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహించి ప్రాణాలను అర్పించిన దయాకర్ రెడ్డి లాంటి పోలీస్ అధికారిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అమర్​ సింగ్ తెలిపారు.​ దయాకర్ రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కుల్సుంపురా పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తూ కరోనా సోకి మృతి చెందిన కానిస్టేబుల్​ దయాకర్ రెడ్డి కుటుంబానికి కార్వాన్ భాజపా నియోజకవర్గ ఇన్​ఛార్జి అమర్ సింగ్ అండగా నిలిచారు. బుధవారం దయాకర్​ రెడ్డి కుటుంబానికి విరాళంగా 1,01,000/- రూపాయల చెక్కును స్థానిక పోలీస్​ అధికారులకు అందజేశారు. ఈ చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు పంపించాలని అమర్​ సింగ్​ పోలీస్​ అధికారులను కోరారు.

తెలంగాణ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహించి ప్రాణాలను అర్పించిన దయాకర్ రెడ్డి లాంటి పోలీస్ అధికారిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అమర్​ సింగ్ తెలిపారు.​ దయాకర్ రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.