దిల్లీలో తెలంగాణ విమోచన దినోత్సవ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి... పోరాటయోధుల వీరగాథలను ప్రదర్శించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నిజాం నిరంకుశ పాలనపై తిరుగబడ్డ వీరులతోపాటు తెలంగాణ విద్యార్థి అమరవీరుల చరిత్రకు కనీసం పాఠ్యాంశాలలో కూడా చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబ చరిత్రనే భావితరాలకు తెలియజేసేవిధంగా...యాదాద్రి గోడలపై చెక్కిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి:'దిల్లీలో తెలంగాణ పోరాటయోధుల చిత్ర ప్రదర్శన'