ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవులు, కళాకారులు తమ ఆట,పాటలతో ప్రజల్లో అవగహన కల్పిస్తున్నారు. సామాజిక దూరం పాటించడమే కాకుండా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మహమ్మారిని తరిమికొట్టాలని యువ కళాకారుడు కిశోర్ తన పాటతో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు.