జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరవుతున్నారు. టోక్యో వెళ్లే భారత ప్రతినిథి బృందంలో జగన్మోహన్ రావు పేరును భారత ఒలింపిక్ సంఘం చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్కు అతిథిగా వెళ్లే ఏకైక వ్యక్తి జగన్మోహన్రావు కావడం విశేషం.
జగన్మోహన్రావుకు అవకాశం రావడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న ఒలింపిక్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడం పట్ల జగన్మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
![టోక్యో ఒలింపిక్స్కు విశిష్ట అతిథిగా అరిశనపల్లి జగన్మోహన్ రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12225183_olympics.jpg)
ఇదీ చదవండి: WTC Final: ఆలస్యంగా ప్రారంభమైన ఐదోరోజు ఆట