ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. వైకాపా ప్రభుత్వం ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. రంగుల మార్పు ఖర్చుతో కూడుకున్న పని కాగా.. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని జగన్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాహనాలపై ఏపీ సీఎం జగన్ ఫొటోలు ఉన్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం.. వాటి ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించాలని జగన్ సర్కార్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: కొత్త పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్: షబ్బీర్ అలీ