ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో 821కి చేరిన కరోనా బాధితులు

author img

By

Published : Apr 23, 2020, 6:17 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతానికిపైగా కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదయ్యాయి. కర్నూలులో ఇప్పటికే 200 కేసులు దాటగా, గుంటూరులోనూ 200లకు చేరువగా ఉన్నాయి. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి సేకరించిన నమూనాల్లో ఇంకా 16 వేలకు పైగా ఫలితాలు రావాల్సిఉంది.

ఏపీలో 821కి చేరిన కరోనా బాధితులు
ఏపీలో 821కి చేరిన కరోనా బాధితులు

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 821కు చేరింది. బుధవారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదవగా గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతలో ఒకరు కరోనాతో కన్నుమూశారు. కర్నూలు జిల్లాలో వైరస్‌ అంతకంతకూ వ్యాపిస్తోంది. బుధవారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 19 మందికి వ్యాధి నిర్థరణకావడంతో జిల్లాలో బాధితుల సంఖ్య 203కు చేరింది. ఆంధ్రప్రదేశ్​లో నమోదైన మొత్తం కేసుల్లో నాల్గో వంతు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల నుంచి 96 మందిని డిశ్చార్జి చేశారు. నందికొట్కూరులో ఒకేసారి 4 కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాలలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున అన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఓ సచివాలయ ఉద్యోగికి పాజిటివ్‌ రావడం వల్ల వార్డు ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సీసీఎల్​ఏ ప్రత్యేక కమిషనర్‌ హరినారాయణతో పాటు, ఏపీఎన్​ఆర్​టీ సీఈవో శ్రీనివాసరావును కోవిడ్ ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులు

ఇక గుంటూరు జిల్లాలోనూ కరోనా విస్తరిస్తోంది. బుధవారం నిర్థరించిన 19 పాజిటివ్ కేసులతో కలిపి బాధితుల సంఖ్య 177కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలో మరోసారి కేసుల తాకిడి కన్పించింది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 380 కరోనా కేసులు నమోదవగా... ఇది ఆ రాష్ట్ర వాటాలో 46.74 శాతమని అధికారులు తెలిపారు. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రి నుంచి 8మంది డిశ్చార్చి అయ్యారు. గన్నవరంలో నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వంద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... జరిమానా చెల్లించి లాక్‌డౌన్ అనంతరం వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 59కు చేరింది. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదవగా.. అవన్నీ శ్రీకాళహస్తిలోనే బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులున్నాయి.

రావాల్సిన ఫలితాలు 16 వేలకు పైగా

ఏపీలో కరోనా వైరస్‌ అనుమానితుల నమూనాల్లో ఇంకా 16వేలకు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా విశాఖలో 5,781 మంది నుంచి నమూనాలు సేకరించారు. విజయనగరం, శ్రీకాకుళంలోనూ 2వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,600లకు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు సేకరించిన నమూనాలన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో సేకరించిన నమూనాలనూ గుంటూరు పరీక్షా కేంద్రానికే పంపుతున్నారు. గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో స్థానిక నమూనాలకే అక్కడ ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రకాశం నమూనాల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 754 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నా 1500కు పైగానే తేలాల్సి ఉందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నమూనాలనూ రాష్ట్రంలోని పలుచోట్లకు పంపుతున్నారు. కర్నూలు బోధనాసుపత్రిలో పరీక్షా కేంద్రం ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి : క్వారంటైన్ కేంద్రాల్లోని 7,587 మందికి పరీక్షలు

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 821కు చేరింది. బుధవారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదవగా గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతలో ఒకరు కరోనాతో కన్నుమూశారు. కర్నూలు జిల్లాలో వైరస్‌ అంతకంతకూ వ్యాపిస్తోంది. బుధవారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 19 మందికి వ్యాధి నిర్థరణకావడంతో జిల్లాలో బాధితుల సంఖ్య 203కు చేరింది. ఆంధ్రప్రదేశ్​లో నమోదైన మొత్తం కేసుల్లో నాల్గో వంతు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల నుంచి 96 మందిని డిశ్చార్జి చేశారు. నందికొట్కూరులో ఒకేసారి 4 కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాలలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున అన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఓ సచివాలయ ఉద్యోగికి పాజిటివ్‌ రావడం వల్ల వార్డు ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సీసీఎల్​ఏ ప్రత్యేక కమిషనర్‌ హరినారాయణతో పాటు, ఏపీఎన్​ఆర్​టీ సీఈవో శ్రీనివాసరావును కోవిడ్ ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులు

ఇక గుంటూరు జిల్లాలోనూ కరోనా విస్తరిస్తోంది. బుధవారం నిర్థరించిన 19 పాజిటివ్ కేసులతో కలిపి బాధితుల సంఖ్య 177కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలో మరోసారి కేసుల తాకిడి కన్పించింది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 380 కరోనా కేసులు నమోదవగా... ఇది ఆ రాష్ట్ర వాటాలో 46.74 శాతమని అధికారులు తెలిపారు. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రి నుంచి 8మంది డిశ్చార్చి అయ్యారు. గన్నవరంలో నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వంద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... జరిమానా చెల్లించి లాక్‌డౌన్ అనంతరం వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 59కు చేరింది. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదవగా.. అవన్నీ శ్రీకాళహస్తిలోనే బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులున్నాయి.

రావాల్సిన ఫలితాలు 16 వేలకు పైగా

ఏపీలో కరోనా వైరస్‌ అనుమానితుల నమూనాల్లో ఇంకా 16వేలకు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా విశాఖలో 5,781 మంది నుంచి నమూనాలు సేకరించారు. విజయనగరం, శ్రీకాకుళంలోనూ 2వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,600లకు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు సేకరించిన నమూనాలన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో సేకరించిన నమూనాలనూ గుంటూరు పరీక్షా కేంద్రానికే పంపుతున్నారు. గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో స్థానిక నమూనాలకే అక్కడ ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రకాశం నమూనాల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 754 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నా 1500కు పైగానే తేలాల్సి ఉందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నమూనాలనూ రాష్ట్రంలోని పలుచోట్లకు పంపుతున్నారు. కర్నూలు బోధనాసుపత్రిలో పరీక్షా కేంద్రం ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి : క్వారంటైన్ కేంద్రాల్లోని 7,587 మందికి పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.