ETV Bharat / state

మదనపల్లె జంట హత్యల కేసు: వెలుగులోకి రాని మరో కోణం ఏంటి..?

author img

By

Published : Jan 30, 2021, 7:11 PM IST

Updated : Jan 30, 2021, 9:15 PM IST

ఒకే ఒక్క కేసు... ఎన్నో మలుపులు... రోజుకో తీరుగా వెలుగులోకి వస్తున్న విస్తుపోయే వాస్తవాలు. చర్చనీయాంశంగా మారిన మదనపల్లె జంట హత్యల కేసులో అసలు నిజానిజాలేంటి..? తల్లిదండ్రుల మాటల్లో వాస్తవమెంత? వారి మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులు చెబుతుంటే... విచారణకు బాగానే సహకరిస్తున్నారంటూ పోలీసులు చెప్పటంలో ఆంతర్యమేంటి..? ఇంతకూ విచారణ అన్ని కోణాల్లోనూ జరుగుతోందా..? ఇవే ఇప్పుడు అందరినీ ఆలోచనల్లోకి నెడుతున్న ప్రశ్నలు. అంతగా బయటకు రాకుండా మిగిలిపోతున్న మరో కోణం... సామాజిక మాధ్యమాల్లో అలేఖ్య, సాయిదివ్యల ఖాతాల వ్యవహారం.

మదనపల్లె జంట హత్యల కేసు: వెలుగులోకి రాని మరో కోణం ఏంటి..?

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని శివనగర్‌లో జరిగిన జంట హత్యల ఉదంతం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత విద్యావంతులైన తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజలు తమ కుమార్తెలైన అలేఖ్య, సాయిదివ్యలను పాశవికంగా అంతమొందించారనే వార్త అందరినీ గగుర్పాటుకి గురి చేసింది. నిందితులుగా తల్లితండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నా.. అలేఖ్య, సాయిదివ్యల సామాజిక మాధ్యమాల ఖాతాల వ్యవహారం నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.

another-angle-in-madanapalle-incident in andhra pradesh
సాయి దివ్య ఇన్​స్టా ఖాతా

ఆ రెండు రోజులు ఏం జరిగింది..?

పెద్దమ్మాయి అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. అన్యమతాలను కించపరుస్తూ... అదే సమయంలో శివుడు వస్తున్నాడు, పని అయిపోయింది అంటూ అలేఖ్య చేసినట్లు భావిస్తున్న పోస్టులు ఇప్పుడీ కేసులో కీలకంగా మారాయి. అలేఖ్య ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో ఆమె వ్యవహరించిన తీరు జనవరి 16వరకూ బాగానే ఉంది. హత్యలు జరిగిన 3 రోజుల ముందు నుంచి మాత్రమే వివాదస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈనెల 21న శివ ఈజ్ కమింగ్ అని పోస్టు పెట్టిన అలేఖ్య... అదే రోజు వర్క్ ఈజ్ డన్ అని 2 పోస్టులు పెట్టింది. తిరిగి 22న కృష్ణుడి బొమ్మతో కలిసి సెల్ఫీ దిగిన అలేఖ్య... మోహినీ హ్యాష్ ట్యాగ్‌ని వాడింది. ఫేస్‌బుక్‌లోని ఖాతా పేరును మోహినీగా మార్చింది. అదే రోజు వేరే మతానికి సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలతో మరో పోస్టు చేసింది. ఈ పోస్టులను అలేఖ్య కవితలు రాసుకొనే "ది హార్ట్స్ పన్ పొయెట్" అనే ఖాతాలోనూ పోస్టు చేసింది. వారం నుంచి ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే పూజలు చేస్తున్నట్లు తల్లి పద్మజ పోలీసులకు చెప్పింది. కానీ ఘటన జరిగిన 2 రోజుల ముందు కూడా అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంది.

another-angle-in-madanapalle-incident in andhra pradesh
పెంపుడు కుక్కతో అలేఖ్య

మిస్టరీగా సాయి దివ్య ఖాతా!

ఇక్కడే ఆలోచన రేకెత్తిస్తున్న మరో అంశం చిన్నకుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు డిలీట్ అవ్వటం. అసలు ఈ పోస్టులను ఎవరు డిలీట్ చేశారు? ఫేస్‌బుక్ ఖాతా ఏమైంది? ఇన్ స్టాగ్రాంలో పోస్టులన్నీ సున్నా చూపించటం వెనుక ఎవరి పాత్ర ఉంది? అలేఖ్య ఫొటోనే సాయి దివ్య డిస్ ప్లే పిక్చర్‌గా ఎవరు మార్చారు? దివ్స్‌ అలేఖ్య అని పేరు ఎవరు పెట్టారు? ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన అంశాలు. పోనీ అలేఖ్యకే 2, 3 అకౌంట్లు ఉన్నాయా? అందులో ఒకటి సాయిదివ్య పేరుతో ఉందా అంటే… గతంలో అలేఖ్య చేసిన కొన్ని పోస్టులకు కింద సాయిదివ్య సమాధానాలివ్వటం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే సాయిదివ్య అకౌంట్​లో ఎవరో మార్పులు చేశారు. ఇప్పటికీ ఆ ఖాతా ప్రైవేట్‌గానే చూపిస్తోంది. అలేఖ్య స్నేహితులు చెబుతోన్న మరో విషయం ఏంటంటే ఆమె ఖాతా సైతం ప్రైవేట్​లోనే ఉండేదట. కేవలం స్నేహితులు, అలేఖ్య అనుమతించిన వాళ్లే ఆ పోస్టులను చూడగలిగేవాళ్లట. మరి ఆ వివాదస్పద పోస్టులను అందరూ చూడగలిగేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చిందెవరనే విషయంలోనూ పలు అనుమానాలున్నాయి.

కుక్క ఏమైంది?

గతంలో అలేఖ్య చేసిన అన్ని పోస్టులను ఒక్కసారి గమనిస్తే అలేఖ్య హేతువాదంతో ఉండేది. తన పోస్టుల్లో ఎక్కడా మతాల ప్రమేయం ఉండేది కాదు. ఓషో, మరో ఆధ్యాత్మిక వేత్త ఫొటోలు ఎక్కువగా పోస్టుల్లో కనిపించేవి. ఇదిలా ఉంటే తనకు, తన చెల్లెలికి మూగజీవాలంటే ఇష్టం అందులోనూ వాళ్లు పెంచుకొనే కుక్కంటే ప్రాణం. రిమాండ్ రిపోర్ట్​లో సైతం కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు తనేదో మంత్రించిన ముగ్గును దాటినట్లు సాయిదివ్య భయపడింది అని ఉంది. తమ కుక్క చనిపోతే.... పెద్దమ్మాయి అలేఖ్య పునర్జన్మ ప్రయోగం చేసి దానిని బతికించిందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. హత్య జరిగిన రోజో అంతకు ముందో తమకెలాంటి కుక్క అరుపులు వినిపించలేదని ఇరుగు పొరుగు వాళ్లు చెబుతున్నారు. మరి ఆ కుక్క ఏమైనట్లు?

another-angle-in-madanapalle-incident in andhra pradesh
"ది హార్ట్స్ పన్ పొయెట్" ఖాతా

ఎన్నో చిక్కుముడులు

వివాదస్పద పోస్టులకు ముందు ఈ నెల 16న అలేఖ్య పెట్టిన ఆఖరి ఫోటో కూడా అనుమానాలకు తావిస్తోంది. అదీ ఒక కారులో అద్దంలో నుంచి చూస్తే అదేదో కొండ ప్రాంతంలా ముళ్లపొదలు, బండరాళ్లతో కనిపిస్తోంది. అంటే అలేఖ్య ఆ రోజు ఎక్కడికి వెళ్లినట్లు.? ఆ తర్వాత పోస్టుల్లో కనిపించిన మార్పులు... చెల్లెలు సాయిదివ్య ఖాతాలో మాయమైన పోస్టులు, మారిన పేర్లు, డీపీలు ఇలా ఈ చిక్కుముడుల ప్రశ్నలు తొలగాంటే సైబర్ నిపుణులైన పోలీసుల ప్రమేయం తప్పనిసరి. శుక్రవారం అలేఖ్య ఫేస్​బుక్ ఖాతా బ్లాక్ అయ్యింది. ఇన్‌స్టాగ్రాం క్రియాశీలకంగానే ఉంది. అసలు అక్కాచెళ్లెల సోషల్ మీడియా ఖాతాలు, వారి ఫోన్లు, కంప్యూటర్లలో తప్ప మరెక్కడైనా లాగిన్ అయ్యాయా అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సింది ఉంది. కనపడకుండా కనుమరుగవుతున్న నిజానిజాలు వెలికితీయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని శివనగర్‌లో జరిగిన జంట హత్యల ఉదంతం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత విద్యావంతులైన తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజలు తమ కుమార్తెలైన అలేఖ్య, సాయిదివ్యలను పాశవికంగా అంతమొందించారనే వార్త అందరినీ గగుర్పాటుకి గురి చేసింది. నిందితులుగా తల్లితండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నా.. అలేఖ్య, సాయిదివ్యల సామాజిక మాధ్యమాల ఖాతాల వ్యవహారం నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.

another-angle-in-madanapalle-incident in andhra pradesh
సాయి దివ్య ఇన్​స్టా ఖాతా

ఆ రెండు రోజులు ఏం జరిగింది..?

పెద్దమ్మాయి అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. అన్యమతాలను కించపరుస్తూ... అదే సమయంలో శివుడు వస్తున్నాడు, పని అయిపోయింది అంటూ అలేఖ్య చేసినట్లు భావిస్తున్న పోస్టులు ఇప్పుడీ కేసులో కీలకంగా మారాయి. అలేఖ్య ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో ఆమె వ్యవహరించిన తీరు జనవరి 16వరకూ బాగానే ఉంది. హత్యలు జరిగిన 3 రోజుల ముందు నుంచి మాత్రమే వివాదస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈనెల 21న శివ ఈజ్ కమింగ్ అని పోస్టు పెట్టిన అలేఖ్య... అదే రోజు వర్క్ ఈజ్ డన్ అని 2 పోస్టులు పెట్టింది. తిరిగి 22న కృష్ణుడి బొమ్మతో కలిసి సెల్ఫీ దిగిన అలేఖ్య... మోహినీ హ్యాష్ ట్యాగ్‌ని వాడింది. ఫేస్‌బుక్‌లోని ఖాతా పేరును మోహినీగా మార్చింది. అదే రోజు వేరే మతానికి సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలతో మరో పోస్టు చేసింది. ఈ పోస్టులను అలేఖ్య కవితలు రాసుకొనే "ది హార్ట్స్ పన్ పొయెట్" అనే ఖాతాలోనూ పోస్టు చేసింది. వారం నుంచి ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే పూజలు చేస్తున్నట్లు తల్లి పద్మజ పోలీసులకు చెప్పింది. కానీ ఘటన జరిగిన 2 రోజుల ముందు కూడా అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంది.

another-angle-in-madanapalle-incident in andhra pradesh
పెంపుడు కుక్కతో అలేఖ్య

మిస్టరీగా సాయి దివ్య ఖాతా!

ఇక్కడే ఆలోచన రేకెత్తిస్తున్న మరో అంశం చిన్నకుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు డిలీట్ అవ్వటం. అసలు ఈ పోస్టులను ఎవరు డిలీట్ చేశారు? ఫేస్‌బుక్ ఖాతా ఏమైంది? ఇన్ స్టాగ్రాంలో పోస్టులన్నీ సున్నా చూపించటం వెనుక ఎవరి పాత్ర ఉంది? అలేఖ్య ఫొటోనే సాయి దివ్య డిస్ ప్లే పిక్చర్‌గా ఎవరు మార్చారు? దివ్స్‌ అలేఖ్య అని పేరు ఎవరు పెట్టారు? ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన అంశాలు. పోనీ అలేఖ్యకే 2, 3 అకౌంట్లు ఉన్నాయా? అందులో ఒకటి సాయిదివ్య పేరుతో ఉందా అంటే… గతంలో అలేఖ్య చేసిన కొన్ని పోస్టులకు కింద సాయిదివ్య సమాధానాలివ్వటం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే సాయిదివ్య అకౌంట్​లో ఎవరో మార్పులు చేశారు. ఇప్పటికీ ఆ ఖాతా ప్రైవేట్‌గానే చూపిస్తోంది. అలేఖ్య స్నేహితులు చెబుతోన్న మరో విషయం ఏంటంటే ఆమె ఖాతా సైతం ప్రైవేట్​లోనే ఉండేదట. కేవలం స్నేహితులు, అలేఖ్య అనుమతించిన వాళ్లే ఆ పోస్టులను చూడగలిగేవాళ్లట. మరి ఆ వివాదస్పద పోస్టులను అందరూ చూడగలిగేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చిందెవరనే విషయంలోనూ పలు అనుమానాలున్నాయి.

కుక్క ఏమైంది?

గతంలో అలేఖ్య చేసిన అన్ని పోస్టులను ఒక్కసారి గమనిస్తే అలేఖ్య హేతువాదంతో ఉండేది. తన పోస్టుల్లో ఎక్కడా మతాల ప్రమేయం ఉండేది కాదు. ఓషో, మరో ఆధ్యాత్మిక వేత్త ఫొటోలు ఎక్కువగా పోస్టుల్లో కనిపించేవి. ఇదిలా ఉంటే తనకు, తన చెల్లెలికి మూగజీవాలంటే ఇష్టం అందులోనూ వాళ్లు పెంచుకొనే కుక్కంటే ప్రాణం. రిమాండ్ రిపోర్ట్​లో సైతం కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు తనేదో మంత్రించిన ముగ్గును దాటినట్లు సాయిదివ్య భయపడింది అని ఉంది. తమ కుక్క చనిపోతే.... పెద్దమ్మాయి అలేఖ్య పునర్జన్మ ప్రయోగం చేసి దానిని బతికించిందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. హత్య జరిగిన రోజో అంతకు ముందో తమకెలాంటి కుక్క అరుపులు వినిపించలేదని ఇరుగు పొరుగు వాళ్లు చెబుతున్నారు. మరి ఆ కుక్క ఏమైనట్లు?

another-angle-in-madanapalle-incident in andhra pradesh
"ది హార్ట్స్ పన్ పొయెట్" ఖాతా

ఎన్నో చిక్కుముడులు

వివాదస్పద పోస్టులకు ముందు ఈ నెల 16న అలేఖ్య పెట్టిన ఆఖరి ఫోటో కూడా అనుమానాలకు తావిస్తోంది. అదీ ఒక కారులో అద్దంలో నుంచి చూస్తే అదేదో కొండ ప్రాంతంలా ముళ్లపొదలు, బండరాళ్లతో కనిపిస్తోంది. అంటే అలేఖ్య ఆ రోజు ఎక్కడికి వెళ్లినట్లు.? ఆ తర్వాత పోస్టుల్లో కనిపించిన మార్పులు... చెల్లెలు సాయిదివ్య ఖాతాలో మాయమైన పోస్టులు, మారిన పేర్లు, డీపీలు ఇలా ఈ చిక్కుముడుల ప్రశ్నలు తొలగాంటే సైబర్ నిపుణులైన పోలీసుల ప్రమేయం తప్పనిసరి. శుక్రవారం అలేఖ్య ఫేస్​బుక్ ఖాతా బ్లాక్ అయ్యింది. ఇన్‌స్టాగ్రాం క్రియాశీలకంగానే ఉంది. అసలు అక్కాచెళ్లెల సోషల్ మీడియా ఖాతాలు, వారి ఫోన్లు, కంప్యూటర్లలో తప్ప మరెక్కడైనా లాగిన్ అయ్యాయా అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సింది ఉంది. కనపడకుండా కనుమరుగవుతున్న నిజానిజాలు వెలికితీయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 30, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.