ETV Bharat / state

ఏపీ వ్యాప్త ఉద్యమంగా అమరావతి పోరు: ఐకాస

author img

By

Published : Dec 17, 2020, 10:54 PM IST

రాజధాని పోరాటాన్ని ఏపీ వ్యాప్త ఉద్యమంగా మార్చేందుకు అమరావతి ఐకాస సిద్ధమైంది. రాయపూడి వేదికగా జరిగిన జనభేరి సభావేదికలో ఈ మేరకు తీర్మానించినట్లు ఐకాస నేతలు తెలిపారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఐకాసలు ఏర్పాటు కానున్నాయి. రాజకీయ పక్షాలు అమరావతిపై ఏకతాటిపైకి వచ్చినందున ఉద్యమ తీవ్రత పెంచేలా కార్యాచరణ రూపొందించారు.

ఏపీ వ్యాప్త ఉద్యమంగా అమరావతి పోరు: ఐకాస
ఏపీ వ్యాప్త ఉద్యమంగా అమరావతి పోరు: ఐకాస

వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలోని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన జనభేరిసభ విజయవంతమైనట్లు అమరావతి ఐకాస నేతలు ప్రకటించారు. ఇన్నాళ్లూ.. గాంధేయమార్గంలో చేసిన పోరాటం ప్రభుత్వాన్ని కదిలించలేకపోవటంపై ఐకాస సమీక్షించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ఉద్యమ తీవ్రతను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ రాజధాని గ్రామాల్లోనే దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని రైతులు, మహిళలే ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. శిబిరాల నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి పోలీసుల అణచివేస్తున్నారు. ప్రతిఘటిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా కేసులు నమోదు కాగా...దాదాపు 3వేల మంది రాజధాని రైతులు, మహిళల్ని అందులో చేర్చారు.

అన్ని జిల్లాల్లో..

కేసులు ఎదుర్కుంటూనే ఉద్యమాన్ని విస్తృతం చేయటంపై బహిరంగసభ ఊపునిచ్చింది. 30వేల మందికి పైగా సభకు హాజరైనట్లు ఐకాస ప్రకటించింది. ఇదే ఊపుతో పోరాటంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని భాగస్వామ్యుల్ని చేయటంపై చర్చించారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో రైతు ఐకాస, రాష్ట్ర పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ ఐకాస, గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయేతర ఐకాస ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇకపై 13 జిల్లాల్లో, 175 నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక ఐకాసలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో, వార్డుల్లోనూ ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఐకాస తరఫున ఏపీ వ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రజల్లోకి ఉద్యమం..

అసలు రాజధాని మార్పు నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి కారణంగానే వచ్చిందనేది ఐకాస భావన. వ్యక్తిగత కక్షలతో సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని... దీనివల్ల రాష్ట్రాభివృద్ది కుంటు పడిందనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చకుండా పాలన సాగటం రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందనే విషయం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అమరావతిలో రాజధానికి మద్దతివ్వటం రైతులు సాధించిన తొలి విజయంగా ఐకాస నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీల వారిని ఒకే వేదికపైకి తెచ్చి వారిని కూడా ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యుల్ని చేయనున్నట్లు తెలిపారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురువుతున్నా..శాంతి, అహింస మార్గంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన జనభేరి సభకు ఉహించని స్పందన లభించింది. ఇదే ఊపులో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించాం. అన్ని జిల్లాల్లో పర్యటించి..175 నియోజకవర్గాల్లో జేఏసీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు అమరావతి ఉద్యమాన్ని చేరవేస్తాం. అన్ని పార్టీల మద్దతుతో అమరావతి పోరును కొనసాగిస్తాం.

-సుధాకర్, అమరావతి రైతు ఐకాస కన్వీనర్

రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం, రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి తీసుకురావటం, వీటికి సమాంతరంగా న్యాయపోరాటం సాగించటం అనే త్రిముఖ వ్యూహంలో ఐకాస పయనం సాగనుంది.

ఇదీచదవండి: అంతరాయం లేకుండా వైద్య సేవలు: ఈటల

వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలోని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన జనభేరిసభ విజయవంతమైనట్లు అమరావతి ఐకాస నేతలు ప్రకటించారు. ఇన్నాళ్లూ.. గాంధేయమార్గంలో చేసిన పోరాటం ప్రభుత్వాన్ని కదిలించలేకపోవటంపై ఐకాస సమీక్షించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ఉద్యమ తీవ్రతను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ రాజధాని గ్రామాల్లోనే దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని రైతులు, మహిళలే ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. శిబిరాల నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి పోలీసుల అణచివేస్తున్నారు. ప్రతిఘటిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా కేసులు నమోదు కాగా...దాదాపు 3వేల మంది రాజధాని రైతులు, మహిళల్ని అందులో చేర్చారు.

అన్ని జిల్లాల్లో..

కేసులు ఎదుర్కుంటూనే ఉద్యమాన్ని విస్తృతం చేయటంపై బహిరంగసభ ఊపునిచ్చింది. 30వేల మందికి పైగా సభకు హాజరైనట్లు ఐకాస ప్రకటించింది. ఇదే ఊపుతో పోరాటంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని భాగస్వామ్యుల్ని చేయటంపై చర్చించారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో రైతు ఐకాస, రాష్ట్ర పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ ఐకాస, గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయేతర ఐకాస ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇకపై 13 జిల్లాల్లో, 175 నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక ఐకాసలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో, వార్డుల్లోనూ ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఐకాస తరఫున ఏపీ వ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రజల్లోకి ఉద్యమం..

అసలు రాజధాని మార్పు నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి కారణంగానే వచ్చిందనేది ఐకాస భావన. వ్యక్తిగత కక్షలతో సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని... దీనివల్ల రాష్ట్రాభివృద్ది కుంటు పడిందనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చకుండా పాలన సాగటం రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందనే విషయం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అమరావతిలో రాజధానికి మద్దతివ్వటం రైతులు సాధించిన తొలి విజయంగా ఐకాస నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీల వారిని ఒకే వేదికపైకి తెచ్చి వారిని కూడా ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యుల్ని చేయనున్నట్లు తెలిపారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురువుతున్నా..శాంతి, అహింస మార్గంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన జనభేరి సభకు ఉహించని స్పందన లభించింది. ఇదే ఊపులో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించాం. అన్ని జిల్లాల్లో పర్యటించి..175 నియోజకవర్గాల్లో జేఏసీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు అమరావతి ఉద్యమాన్ని చేరవేస్తాం. అన్ని పార్టీల మద్దతుతో అమరావతి పోరును కొనసాగిస్తాం.

-సుధాకర్, అమరావతి రైతు ఐకాస కన్వీనర్

రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం, రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి తీసుకురావటం, వీటికి సమాంతరంగా న్యాయపోరాటం సాగించటం అనే త్రిముఖ వ్యూహంలో ఐకాస పయనం సాగనుంది.

ఇదీచదవండి: అంతరాయం లేకుండా వైద్య సేవలు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.