ETV Bharat / state

ఉద్రిక్తంగా మారిన అమరావతి మహిళా ఐకాస రథోత్సవం పర్యటన - అమరావతి

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, అతని అనుచరులు వ్యవహరించిన తీరు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లిన రైతుల వద్ద ఎంపీ కాన్వాయ్ దూకుడుగా వెళ్లడం వల్ల ఓ రైతు గాయపడ్డారు. ఆ తర్వాత ఎంపీ తిరిగి వెళ్తున్న సమయంలో రాజధాని మహిళలు ఆయనను అడ్డుకోవడం... ఆయన అనుచరులు వారిని నెట్టివేయటం వాగ్వాదానికి దారి తీసింది. ఎంపీ సురేశ్, వైకాపా నేతలపై మహిళా ఐకాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Women Angry on MP
Women Angry on MP
author img

By

Published : Feb 24, 2020, 9:18 AM IST

ఉద్రిక్తంగా మారిన అమరావతి మహిళా ఐకాస రథోత్సవం పర్యటన

ఏపీలో అమరావతి ఐకాస మహిళా నేతల అమరావతి రథోత్సవ పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిలోనే ఉండాలనే సంకల్పంతో అమరలింగేశ్వర స్వామి రథోత్సవానికి మహిళా ఐకాస నేతలు వెళ్తున్నారు. అదే సమయంలో రథోత్సవం నుంచి తిరిగొస్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ లేమల్లే వద్ద మహిళలకు తారసపడ్డారు. జై అమరావతి అని అనాలంటూ మహిళా ఐకాస నేతలు ఎంపీని డిమాండ్‌ చేశారు. అందుకు ఆయన అంగీకరించలేదు.

అదే సమయంలో వైకాపా కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మా ఎంపీని ఆపుతారా అంటూ ఆందోళనకారులను నెట్టేసి, సురేశ్​ను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత మహిళా ఐకాస నేతలు... అక్కడికి వచ్చిన బస్సును చుట్టుముట్టారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకొని ఐకాస నేతలను అమరావతి ఠాణాకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు అమరావతి పోలీస్​స్టేషన్​కు చేరుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ స్టేషన్‌ ముందు బైఠాయించారు.

మహిళలపై దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన ఎంపీపై కాకుండా తిరిగి తమపైనే కేసులు ఎలా పెడతారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్య, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మహిళలకు సంఘీభావం తెలిపారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి, మహిళలపై ఇష్టారీతిన మాట్లాడటం ఏంటని నిలదీశారు.

మహిళలపై దురుసుగా ప్రవర్తించిన ఎంపీ సురేశ్​, దాడికి పాల్పడ్డ ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని... అరెస్టు చేసిన ఐకాస నేతలను విడిచిపెట్టాలని కోరారు. అక్కడున్న పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత అక్కడకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెదేపా నేతలతో చర్చించారు. ఫిర్యాదు తీసుకుంటామని చెప్పారు. విచారించి ఎంపీపై కేసు నమోదు చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. అంతకుముందు రథోత్సవం నుంచి తిరిగివస్తోన్న సురేశ్ వాహనం రైతుల ర్యాలీపైకి దూసుకెళ్లింది. వాహనం తగిలి హనుమంతరావు అనే రైతు కాలికి గాయమైంది. దీనిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : పాలమూరు నుంచి పట్టణ ప్రగతికి శ్రీకారం

ఉద్రిక్తంగా మారిన అమరావతి మహిళా ఐకాస రథోత్సవం పర్యటన

ఏపీలో అమరావతి ఐకాస మహిళా నేతల అమరావతి రథోత్సవ పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిలోనే ఉండాలనే సంకల్పంతో అమరలింగేశ్వర స్వామి రథోత్సవానికి మహిళా ఐకాస నేతలు వెళ్తున్నారు. అదే సమయంలో రథోత్సవం నుంచి తిరిగొస్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ లేమల్లే వద్ద మహిళలకు తారసపడ్డారు. జై అమరావతి అని అనాలంటూ మహిళా ఐకాస నేతలు ఎంపీని డిమాండ్‌ చేశారు. అందుకు ఆయన అంగీకరించలేదు.

అదే సమయంలో వైకాపా కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మా ఎంపీని ఆపుతారా అంటూ ఆందోళనకారులను నెట్టేసి, సురేశ్​ను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత మహిళా ఐకాస నేతలు... అక్కడికి వచ్చిన బస్సును చుట్టుముట్టారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకొని ఐకాస నేతలను అమరావతి ఠాణాకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు అమరావతి పోలీస్​స్టేషన్​కు చేరుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ స్టేషన్‌ ముందు బైఠాయించారు.

మహిళలపై దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన ఎంపీపై కాకుండా తిరిగి తమపైనే కేసులు ఎలా పెడతారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్య, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మహిళలకు సంఘీభావం తెలిపారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి, మహిళలపై ఇష్టారీతిన మాట్లాడటం ఏంటని నిలదీశారు.

మహిళలపై దురుసుగా ప్రవర్తించిన ఎంపీ సురేశ్​, దాడికి పాల్పడ్డ ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని... అరెస్టు చేసిన ఐకాస నేతలను విడిచిపెట్టాలని కోరారు. అక్కడున్న పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత అక్కడకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెదేపా నేతలతో చర్చించారు. ఫిర్యాదు తీసుకుంటామని చెప్పారు. విచారించి ఎంపీపై కేసు నమోదు చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. అంతకుముందు రథోత్సవం నుంచి తిరిగివస్తోన్న సురేశ్ వాహనం రైతుల ర్యాలీపైకి దూసుకెళ్లింది. వాహనం తగిలి హనుమంతరావు అనే రైతు కాలికి గాయమైంది. దీనిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : పాలమూరు నుంచి పట్టణ ప్రగతికి శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.