ETV Bharat / state

ఆరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మారేళ్ల శ్రీనివాసరావు

author img

By

Published : Nov 28, 2020, 9:47 PM IST

ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆల్విన్​ కాలనీ డివిజన్​ అభ్యర్థి మారేళ్ల శ్రీనివాస్​రావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిపించాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Alwin colony congress candidate election compaign in ghmc
ఆరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మారేళ్ల శ్రీనివాసరావు

వరద బాధితులకు సాయం అందించకుండా తెరాస నాయకులే డబ్బులను పంచుకున్నారని కాంగ్రెస్ ఆల్విన్​కాలనీ డివిజన్​ అభ్యర్థి మారేళ్ల శ్రీనివాస్​రావు అన్నారు. జీహెచ్​ఎంసీలో ఆరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

డివిజన్​లోని ఎల్లమ్మబండ బస్తీలో ప్రధానంగా డ్రైనేజీ, రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసముంటున్న ప్రజలకు ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. కరోనా కాలంలో రేషన్ కార్డులు లేని ఎలాంటి సాయం అందించలేదని...ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్​ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:అపార్టుమెంట్​వాసులకు 20వేల లీటర్ల ఉచితనీరు: కేసీఆర్

వరద బాధితులకు సాయం అందించకుండా తెరాస నాయకులే డబ్బులను పంచుకున్నారని కాంగ్రెస్ ఆల్విన్​కాలనీ డివిజన్​ అభ్యర్థి మారేళ్ల శ్రీనివాస్​రావు అన్నారు. జీహెచ్​ఎంసీలో ఆరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

డివిజన్​లోని ఎల్లమ్మబండ బస్తీలో ప్రధానంగా డ్రైనేజీ, రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసముంటున్న ప్రజలకు ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. కరోనా కాలంలో రేషన్ కార్డులు లేని ఎలాంటి సాయం అందించలేదని...ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్​ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:అపార్టుమెంట్​వాసులకు 20వేల లీటర్ల ఉచితనీరు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.