ETV Bharat / state

'అన్నదాతలు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యం'

author img

By

Published : Jan 7, 2020, 7:24 PM IST

Updated : Jan 7, 2020, 10:42 PM IST

అన్నం పెట్టే రైతన్న ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేరళలోని త్రిస్సూరులో 'సాగును లాభదాయకం చేయడం ఎలా?'  అనే అంశంపై జరుగుతున్న సదస్సుకు మంత్రి హాజరయ్యారు.

agriculture minister niranjanreddy attended in vaiga 2020 conference in kerala
'అన్నదాత ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యం'

ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల వ్యవసాయ, ఉద్యానోత్పత్తులకు పొలం వద్దనే మద్దతు ధర కల్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని 14 అంశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌస్​లు, సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం అందించడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు.

వివిధ పంటలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నందిపేట, వేల్పూరులో పసుపు, పాలు, అపరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉండగా... సత్తుపల్లి, జనగాం జిల్లా కల్లెంలో పండ్లు, కూరగాయలు.. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో రైస్ మిల్లు, వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మామిడి, మొక్కజొన్నకు అనుకూలంగా ఉండగా... సిరిసిల్లలో పశువుల ఆహారం, జహీరాబాద్‌లో మాంసం, పాల ఉత్పత్తులు పరిశ్రమకు బాగుంటుందని మంత్రి తెలిపారు.

రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వినియోగదారుల ఉత్పత్తులు... యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమని వివరించారు. కార్యక్రమంలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్, కేరళ ప్రభుత్వ చీఫ్ విప్ కె.రాజన్, ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి దేవేంద్రకుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం... త్రిసూర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల సంస్థను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు.

'అన్నదాతలు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యం'

ఇదీ చూడండి: 'పాల ఎగుమతుల్లో భారత్ అగ్రగామి'

ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల వ్యవసాయ, ఉద్యానోత్పత్తులకు పొలం వద్దనే మద్దతు ధర కల్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని 14 అంశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌస్​లు, సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం అందించడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు.

వివిధ పంటలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నందిపేట, వేల్పూరులో పసుపు, పాలు, అపరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉండగా... సత్తుపల్లి, జనగాం జిల్లా కల్లెంలో పండ్లు, కూరగాయలు.. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో రైస్ మిల్లు, వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మామిడి, మొక్కజొన్నకు అనుకూలంగా ఉండగా... సిరిసిల్లలో పశువుల ఆహారం, జహీరాబాద్‌లో మాంసం, పాల ఉత్పత్తులు పరిశ్రమకు బాగుంటుందని మంత్రి తెలిపారు.

రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వినియోగదారుల ఉత్పత్తులు... యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమని వివరించారు. కార్యక్రమంలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్, కేరళ ప్రభుత్వ చీఫ్ విప్ కె.రాజన్, ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి దేవేంద్రకుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం... త్రిసూర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల సంస్థను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు.

'అన్నదాతలు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యం'

ఇదీ చూడండి: 'పాల ఎగుమతుల్లో భారత్ అగ్రగామి'

07-01-2019 TG_HYD_39_07_AGRI_MINISTER_KERALA_TOUR_AB_3038200 REPORTER : MALLIK.B Note : feed from desk whatsApp ( ) దేశానికి అన్నం పెట్టే రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే కేసీఆర్ సర్కారు లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని చెప్పారు. "వ్యవసాయ రంగం - అదనపు విలువ జోడింపు, ఆదాయాలు సృష్టించి లాభదాయకం చేయడం ఎలా...?" అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు - 2020కు మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేరళ వ్యవసాయ శాఖా మంత్రి వీఎస్ సునీల్ కుమార్, కేరళ చీఫ్ విప్ కె.రాజన్, ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి, దేవేంద్రకుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల వ్యవసాయ, ఉద్యానోత్పత్తులకు పొలం వద్దనే మద్దతు ధర కల్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దాని మూలంగా రైతులకు ఆదాయం పెంచడంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో ఉన్న 14 అంశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌజ్‌లు, సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం అందించడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ప్రకటించారు. ఆహార శుదకధి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఆహార ఉత్పత్తుల యాజమాన్యంతోపాటు రైతుకు తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. వివిధ పంటలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నందిపేట, వేల్పూరులో పసుపు, పాలు, అపరాలు, సత్తుపల్లి, జనగాం జిల్లా కల్లెంలో పండ్లు, కూరగాయలు, సిద్దిపేట, సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో రైస్ మిల్లు, వ్యవసాయ ఉత్పత్తులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మామిడి, మొక్కజొన్న, సిరిసిల్లలో పశువుల ఆహారం, జహీరాబాద్‌లో మాంసం, పాల ఉత్పత్తులు, రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వినియోగదారుల ఉత్పత్తులు, యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆహారోత్పత్తుల శుద్ది పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమని వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం... త్రిసూర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల సంస్థను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. VIS..........BYTE............ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Last Updated : Jan 7, 2020, 10:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.