ETV Bharat / state

'17న రాష్ట్రమంతటా మొక్కలు నాటే కార్యక్రమం'

author img

By

Published : Feb 15, 2020, 11:36 PM IST

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. ముఖ్యమంత్రి​ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట్రమంతటా పెద్దఎత్తున మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.

Minister Talasani
Minister Talasani

పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలలు, డెయిరీలు, మత్య్సశాఖ కార్యాలయాలు, వెటర్నరీ విశ్వవిద్యాలయాల ఆవరణల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలలు, డెయిరీలు, మత్య్సశాఖ కార్యాలయాలు, వెటర్నరీ విశ్వవిద్యాలయాల ఆవరణల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సింగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.