నకిలీ వీసాలతో మహిళలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు పంపుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో నరేశ్, తిరుపతిరెడ్డి అనే యువకులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొంత కాలంగా నకిలీ వీసాలు సృష్టించి నేపాల్కి చెందిన మహిళలను గల్ఫ్ దేశాలకు పంపుతున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు.
గతంలో నకిలీ ధ్రువపత్రాలతో వీసాలు సృష్టించి 150 మందిని పంపినట్లు తమ విచారణలో తెలిందని పేర్కొన్నారు. నిందితుల నుంచి 7 ఇండియన్ పాస్పోర్టులు, 2 నేపాల్ పాస్పోర్టులు, 4 చరవాణిలు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.
ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు