ETV Bharat / state

ప్రత్యక్ష తరగతులకు తొలిరోజు 9 శాతం హాజరు - ts schools latest news

ఇవాళ్టి నుంచి ప్రారంభమైన 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు తొలి రోజు సరైన స్పందన కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9 శాతం మాత్రమే హాజరు నమోదైంది. క్రమక్రమంగా విద్యార్థుల హాజరు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

9 percent attendance on the first day of live classes
ప్రత్యక్ష తరగతులకు తొలిరోజు 9 శాతం హాజరు నమోదు
author img

By

Published : Feb 24, 2021, 10:33 PM IST

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు తొలి రోజు విద్యార్థుల నుంచి సరైన స్పందన కనిపించలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే బడులకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,030 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 13,11,772 మంది విద్యార్థులు ఉండగా.. ఇవాళ కేవలం 1,17,304 విద్యార్థులు హాజరయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు తెరిచారు. ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 70 నుంచి 80 శాతం ప్రారంభించినట్లు విద్యాశాఖ తెలిపింది. క్రమక్రమంగా విద్యార్థుల హాజరు పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారమే ప్రకటించటం వల్ల తల్లిదండ్రుల అనుమతి పత్రాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

మరోవైపు 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు గురుకులాలు ఇవాళ తెరుచుకోలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇవాళ గదులు శుభ్రం చేసి, వాహనాలను సిద్ధం చేసుకున్నారు. తొమ్మిది, పదో తరగతుల్లో హాజరు పెరిగింది. ఇవాళ తొమ్మిదో తరగతిలో 67 శాతం, పదో తరగతిలో 78 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 6,7,8 తరగతులు

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు తొలి రోజు విద్యార్థుల నుంచి సరైన స్పందన కనిపించలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే బడులకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,030 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 13,11,772 మంది విద్యార్థులు ఉండగా.. ఇవాళ కేవలం 1,17,304 విద్యార్థులు హాజరయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు తెరిచారు. ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 70 నుంచి 80 శాతం ప్రారంభించినట్లు విద్యాశాఖ తెలిపింది. క్రమక్రమంగా విద్యార్థుల హాజరు పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారమే ప్రకటించటం వల్ల తల్లిదండ్రుల అనుమతి పత్రాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

మరోవైపు 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు గురుకులాలు ఇవాళ తెరుచుకోలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇవాళ గదులు శుభ్రం చేసి, వాహనాలను సిద్ధం చేసుకున్నారు. తొమ్మిది, పదో తరగతుల్లో హాజరు పెరిగింది. ఇవాళ తొమ్మిదో తరగతిలో 67 శాతం, పదో తరగతిలో 78 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 6,7,8 తరగతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.