ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే చాలు.. వయస్సుతో పనిలేదు అని నిరూపించాడు ఆ పెద్దాయన. ఉత్తర్ప్రదేశ్లోని గోండా ప్రాంతం దూలమ్పుర్ నివాసి రామ్కరణ్ ప్రజాపతి.. 78 ఏళ్ల వయస్సులో చదువు విలువను చాటి చెప్పారు. వృత్తిరీత్యా కుమ్మరి అయిన రామ్కరణ్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం.. హిందీ పరీక్ష రాసేందుకు వచ్చారు.
1942 జులై 11న జన్మించిన రామ్కరణ్ 1997లో ఎస్ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు సైకిల్ పంచర్ షాప్ నిర్వహిస్తున్నారు. పేదరికంలో.. అదీ పెద్ద వయస్సులోనూ చదవాలన్న ఆయన పట్టుదలకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఇదీ చూడండి: ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ టన్నులకొద్దీ పసిడి!