ETV Bharat / state

51 కళాశాలలు మూసివేత.. తగ్గనున్న ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు

author img

By

Published : Nov 11, 2020, 2:39 PM IST

ఏపీవ్యాప్తంగా ఈసారి 51 ఇంజినీరింగ్, బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. కళాశాలల్లో మౌలికవసతులు, అనుమతలపై పాలకవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఈ ఏడాది 17,00 వరకూ సీట్లు తగనున్నాయి.

51 కళాశాలలు మూసివేత.. తగ్గనున్న ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు
51 కళాశాలలు మూసివేత.. తగ్గనున్న ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు

ఆంధ్రప్రదేశ్​లో ఈసారి 51 ఇంజినీరింగ్, బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలపై జేఎన్టీయూ-(కాకినాడ) తుది నిర్ణయం తీసుకోలేదు. కళాశాలల్లో మౌలికవసతులు, అనుమతుల పై అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ పాలకవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తగ్గనున్న 1700 సీట్లు..

జేఎన్‌టీయూ-కాకినాడ పరిధిలో 26 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు ఈ ఏడాది మూతపడనున్నాయి. మరో రెండు కళాశాలలపై నిర్ణయం పెడింగ్‌లో ఉంది. నిబంధనలు పాటించని 45 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 4800 సీట్లు తగ్గించారు. మూతపడే కళాశాలలతో కలిపి.. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 12,600 సీట్ల వరకు తగ్గనున్నాయి. అనంతపురం-జేఎన్ట్టీయూ పరిధిలో.. 23 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు నిలిపివేయనున్నారు. 17 కళాశాలల సీట్లలో కోత విధించారు. అనంతపురం-జేఎన్టీయూ పరిధిలో 41 వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఉండగా.. ఈసారి 5,100 సీట్లు తగనున్నాయి. మొత్తం అన్ని కలిపి రాష్ట్రంలో ఈ ఏడాది 17,00 వరకూ సీట్లు తగనున్నాయి.

మరోవైపు ఈ ఏడాది బీఎస్సీ వ్యవసాయం, ఉద్యానం, వెటర్నరీ సైన్సు, మత్స్యకోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారం అందించాలని ఉన్నత విద్యామండలిని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోరింది.

ఇదీ చదవండి: అశ్రునయనాల మధ్య వీరజవాన్​ మహేశ్​ అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్​లో ఈసారి 51 ఇంజినీరింగ్, బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలపై జేఎన్టీయూ-(కాకినాడ) తుది నిర్ణయం తీసుకోలేదు. కళాశాలల్లో మౌలికవసతులు, అనుమతుల పై అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ పాలకవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తగ్గనున్న 1700 సీట్లు..

జేఎన్‌టీయూ-కాకినాడ పరిధిలో 26 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు ఈ ఏడాది మూతపడనున్నాయి. మరో రెండు కళాశాలలపై నిర్ణయం పెడింగ్‌లో ఉంది. నిబంధనలు పాటించని 45 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 4800 సీట్లు తగ్గించారు. మూతపడే కళాశాలలతో కలిపి.. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 12,600 సీట్ల వరకు తగ్గనున్నాయి. అనంతపురం-జేఎన్ట్టీయూ పరిధిలో.. 23 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు నిలిపివేయనున్నారు. 17 కళాశాలల సీట్లలో కోత విధించారు. అనంతపురం-జేఎన్టీయూ పరిధిలో 41 వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఉండగా.. ఈసారి 5,100 సీట్లు తగనున్నాయి. మొత్తం అన్ని కలిపి రాష్ట్రంలో ఈ ఏడాది 17,00 వరకూ సీట్లు తగనున్నాయి.

మరోవైపు ఈ ఏడాది బీఎస్సీ వ్యవసాయం, ఉద్యానం, వెటర్నరీ సైన్సు, మత్స్యకోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారం అందించాలని ఉన్నత విద్యామండలిని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోరింది.

ఇదీ చదవండి: అశ్రునయనాల మధ్య వీరజవాన్​ మహేశ్​ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.