ETV Bharat / state

హుస్సేన్ సాగర్​లో జాతీయ సెయిలింగ్ పోటీలు షురూ

జాతీయ స్థాయిలో నేటి నుంచి జరగనున్న సెయిలింగ్ పోటీలు హైదరాబాద్ హుస్సేన్​సాగర్​లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమ ప్రారంభోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Jul 2, 2019, 5:19 PM IST

Updated : Jul 2, 2019, 7:09 PM IST

ఈసారి మన సెయిలర్స్‌ చాంపియన్‌గా నిలవాలి : గవర్నర్ నరసింహన్

హైదరాబాద్​లో 34వ జాతీయ స్థాయి సెయిలింగ్ వీక్ పోటీలను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కావడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. గత 33 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోటీల్లో ఈసారి తెలంగాణ నుంచి సెయిలర్స్‌ చాంపియన్‌గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
నేటి నుంచి వారం రోజుల పాటు సెయిలింగ్ పోటీలు నగర వాసులకు కనువిందు చేయనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సెయిలర్స్‌ ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చనున్నారు. కార్యక్రమంలో ఆర్మీ, నేవీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

34వ జాతీయ స్థాయి సెయిలింగ్ వీక్ పోటీలను ప్రారంభించిన గవర్నర్

ఇవీ చూడండి : హైదరాబాద్​ పోలీసుల చెరలో బ్లఫ్​మాస్టర్​

హైదరాబాద్​లో 34వ జాతీయ స్థాయి సెయిలింగ్ వీక్ పోటీలను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కావడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. గత 33 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోటీల్లో ఈసారి తెలంగాణ నుంచి సెయిలర్స్‌ చాంపియన్‌గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
నేటి నుంచి వారం రోజుల పాటు సెయిలింగ్ పోటీలు నగర వాసులకు కనువిందు చేయనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సెయిలర్స్‌ ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చనున్నారు. కార్యక్రమంలో ఆర్మీ, నేవీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

34వ జాతీయ స్థాయి సెయిలింగ్ వీక్ పోటీలను ప్రారంభించిన గవర్నర్

ఇవీ చూడండి : హైదరాబాద్​ పోలీసుల చెరలో బ్లఫ్​మాస్టర్​

Intro:Body:Conclusion:
Last Updated : Jul 2, 2019, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.