షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నెక్లెస్రోడ్లో 'వీ ఆర్ వన్' పేరుతో షీ టీమ్ ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించారు. దీనిని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. స్త్రీ, పురుష భేదభావం ఉండకూడదనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లో మహిళల భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలను అదనపు సీపీ షీకా గోయల్ వివరించారు. సీఎస్ ఎస్కే జోషి, యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, డీజీపీ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ హాజరయ్యారు. పరుగులో సినీనటి పూజా హెగ్డే, నిహారిక కొణిదెల, క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కూడా యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండిః'కరీంనగర్' నుంచే 'కారు' ప్రయాణం