1954లో జన్మించిన టి.పద్మారావు గౌడ్ 1974లో యువజన కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1986లో మొదటిసారిగా మొండా మార్కెట్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.
2001 నుంచి తెరాసతోనే...
2001లో తెరాస ప్రారంభించిన నాటి నుంచి అందులోనే ఉండి వివిధ పదవులు చేపట్టారు. 2002లో తెరాస పక్షాన కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో అక్కడి నుంచే ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.