ETV Bharat / state

మూడు రోజుల పాటు జనసాధారణ్​ రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే  ప్రయాణికుల సౌకర్యార్థం మూడు రోజులపాటు జనసాధారణ్​ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచి రేణిగుంట, విజయనగరం, సికింద్రాబాద్​ నుంచి విజయనగరంనకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : May 30, 2019, 12:07 AM IST

మూడు రోజుల పాటు జనసాధారణ్​ రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-రేణిగుంట, విజయవాడ-విజయనగరం, విజయనగరం-సికింద్రాబాద్ మధ్య వేసవిలో జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేష్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రైళ్లు నేటి నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ జనసాధారణ్ రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా 18 రెండవ తరగతి సాధారణ బోగీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు ప్రతి రైలుకు రెండు రవాణా, బ్రేక్ వ్యాన్ కోచ్​లను అనుసంధానం చేశామని తెలిపారు.

మూడు రోజుల పాటు జనసాధారణ్​ రైళ్లు
ఇవీ చూడండి: కేటీఆర్​కు రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-రేణిగుంట, విజయవాడ-విజయనగరం, విజయనగరం-సికింద్రాబాద్ మధ్య వేసవిలో జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేష్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రైళ్లు నేటి నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ జనసాధారణ్ రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా 18 రెండవ తరగతి సాధారణ బోగీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు ప్రతి రైలుకు రెండు రవాణా, బ్రేక్ వ్యాన్ కోచ్​లను అనుసంధానం చేశామని తెలిపారు.

మూడు రోజుల పాటు జనసాధారణ్​ రైళ్లు
ఇవీ చూడండి: కేటీఆర్​కు రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.