ETV Bharat / state

ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా: మంత్రి పువ్వాడ - ఖమ్మం వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శాటిలైట్ బస్ డిపో పనులకు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ శంకుస్థాపన చేశారు. దశాబ్దాల ఇల్లెందు వాసుల కల నెరవేరేలా బస్ డిపోను రూ.3.75కోట్లతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దసరానాటికి నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు.

rtc
rtc
author img

By

Published : Feb 10, 2021, 4:57 PM IST

"ఇవాళ మా 30వ వివాహ వార్షికోత్సవం... అయినప్పటకీ మా ఆవిడను వదిలి డిపో చుట్టూ తిరుగుతున్నా.. ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా. ఆర్టీసీ అంటే నాకు అంత ఇష్టం" ఇల్లెందులో శాటిలైట్​ బస్​డిపోకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి పువ్వాడ ఈ విధంగా చమత్కరించారు. ఇల్లెందులో శాటిలైట్​ బస్​డిపోను దసరానాటికి ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతుంటే కాంగ్రెస్​ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పువ్వాడ ఆరోపించారు. సీతారామ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల వారిగా పర్యటన చేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై ఎటువంటి భయం ఆందోళన అవసరం లేదని తెలిపారు.

ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా: మంత్రి పువ్వాడ

ఇదీ చూడండి: భారత ఫుట్​బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.