ETV Bharat / state

నిన్న సమ్మెకు మద్దతు... నేడు విధులకు హాజరు - సింగరేణి కార్మికుల ధర్నాలు

మూడు రోజుల సమ్మెను ప్రతిపాదించిన జాతీయ కార్మిక సంఘాలకు... రాష్ట్ర బొగ్గు గని కార్మిక సంఘాలు నిన్న మద్దతు తెలిపి నేడు విధులకు హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో విధులకు వెళ్తున్న వారిని జాతీయ కార్మిక సంఘాలు అడ్డుకునేందుకు యత్నించగా... పోలీసులు వారిని నిలువరించారు.

singareni-mine-workers-protest-second-day-at-bhadradri-kothagudem
నిన్న సమ్మెకు మద్దతు... నేడు విధులకు హాజరు
author img

By

Published : Jul 3, 2020, 8:28 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెను ప్రతిపాదించిన నేపథ్యంలో... రాష్ట్ర బొగ్గు గని కార్మిక సంఘాలు నిన్న సమ్మెకు మద్దతు తెలిపాయి. నేడు కార్మికుల సంఘం మద్దతుతో కొందరు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు.

జాతీయ కార్మిక సంఘాల నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా... పోలీసులు వారిని నిలువరించారు. పోలీసుల బందోబస్తు నడుమ వివిధ గనుల్లో కార్మికులు అక్కడక్కడ హాజరయ్యారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల జాతీయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెను ప్రతిపాదించిన నేపథ్యంలో... రాష్ట్ర బొగ్గు గని కార్మిక సంఘాలు నిన్న సమ్మెకు మద్దతు తెలిపాయి. నేడు కార్మికుల సంఘం మద్దతుతో కొందరు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు.

జాతీయ కార్మిక సంఘాల నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా... పోలీసులు వారిని నిలువరించారు. పోలీసుల బందోబస్తు నడుమ వివిధ గనుల్లో కార్మికులు అక్కడక్కడ హాజరయ్యారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల జాతీయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: బీమా ఉన్నా సొమ్ము కడితేనే కరోనాకు చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.