ETV Bharat / state

మూడింట ఒక్కటే దిక్కైన ఆధార్​ కేంద్రం.. వేలిముద్రకై అవస్థ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆధార్​ కష్టాలు తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఆధార్ నమోదు, సవరణల కోసం ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణంలో మూడు మీ సేవా కేంద్రాలు ఉండగా కేవలం ఒక్క కేంద్రంలో మాత్రమే సేవలు నడుస్తోంది. దీనితో ప్రజానికం అందరూ దానివద్దకే గుమిగూడుతున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేలిముద్రలతో సమస్యలన్న సాకుతో అధికారులు స్పందించడం లేదని వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mee seva aadhar centers in bhadradri kothagudem district
మూడింట ఒక్కటే దిక్కైన ఆధార్​ కేంద్రం.. వేలిముద్రకై అవస్థ
author img

By

Published : Aug 1, 2020, 3:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మూడు ఆధార్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. కరోనా నేపథ్యంలో పోస్టాఫీసులో, మరొకచోట సేవలు నిలిపివేశారు. పురపాలక సంఘ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మీ-సేవా మాత్రమే సేవలందించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సాధారణ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఇక్కడకు రావడానికి అయిష్టత చూపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఈ సమస్యపై కన్నెత్తి చూడకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు.

కొత్త ఆధార్ నమోదు కంటే సవరణల సమస్య అధికంగా ఉంటుండడం.. ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాధి సైతం వృద్ధాప్యంలో ఉన్న వారికి అధికంగా వస్తుండడటం వల్ల ఈ పరిస్థితి మరింత అయోమయంగా మారింది. పూర్తిగా వేలిముద్రలు, కంటితో నడిచే కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీనితో అందరూ ఆ ఒక్క కేంద్రం వద్దకే పోటెత్తడం జరుగుతుంది. అది కాస్త అప్పుడప్పుడు మొరాయిస్తే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోందని.. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మూడు ఆధార్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. కరోనా నేపథ్యంలో పోస్టాఫీసులో, మరొకచోట సేవలు నిలిపివేశారు. పురపాలక సంఘ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మీ-సేవా మాత్రమే సేవలందించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సాధారణ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఇక్కడకు రావడానికి అయిష్టత చూపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఈ సమస్యపై కన్నెత్తి చూడకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు.

కొత్త ఆధార్ నమోదు కంటే సవరణల సమస్య అధికంగా ఉంటుండడం.. ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాధి సైతం వృద్ధాప్యంలో ఉన్న వారికి అధికంగా వస్తుండడటం వల్ల ఈ పరిస్థితి మరింత అయోమయంగా మారింది. పూర్తిగా వేలిముద్రలు, కంటితో నడిచే కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీనితో అందరూ ఆ ఒక్క కేంద్రం వద్దకే పోటెత్తడం జరుగుతుంది. అది కాస్త అప్పుడప్పుడు మొరాయిస్తే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోందని.. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.