ETV Bharat / state

భద్రాద్రి రామయ్యకు ఓ భక్తురాలి బంగారు కానుక - బెంగళూరు భక్తురాలు వాణీ గుప్తా కానుక

భద్రాచలం రామయ్యకు ఓ భక్తురాలు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించారు. బెంగళూరుకు చెందిన వాణీ గుప్తా ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి అందించారు.

Breaking News
author img

By

Published : Mar 6, 2021, 5:56 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల స్వామివారికి ఓ భక్తురాలు బంగారు కానుక సమర్పించారు. స్వామివారికి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. బెంగళూరుకు చెందిన వాణీ గుప్తా స్వామివారి కోసం వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఈ రోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ఆలయ అధికారులకు వాటిని అందించారు. వీటిలో 2 బంగారు కడియాలు, బంగారు, ముత్యాల హారాలు ఉన్నాయి. రామయ్యకు తమ మొక్కును చెల్లించినట్లు వాణి గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి: మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల స్వామివారికి ఓ భక్తురాలు బంగారు కానుక సమర్పించారు. స్వామివారికి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. బెంగళూరుకు చెందిన వాణీ గుప్తా స్వామివారి కోసం వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఈ రోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ఆలయ అధికారులకు వాటిని అందించారు. వీటిలో 2 బంగారు కడియాలు, బంగారు, ముత్యాల హారాలు ఉన్నాయి. రామయ్యకు తమ మొక్కును చెల్లించినట్లు వాణి గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి: మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.